News October 31, 2025

కాఫీ/ టీ తాగే అలవాటు ఉందా?

image

ఎంతోమందికి ఇష్టమైన కాఫీ, టీలు ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ వాటిలో ఉండే ‘టాన్సిన్స్’ రసాయనాలు దంతాల రంగును మారుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి దంతాల ఎనామిల్‌పై పేరుకుపోయి కాలక్రమేణా పసుపు లేదా గోధుమ రంగు మరకలకు కారణమవుతాయని చెబుతున్నారు. కాఫీ కంటే టీ తాగేవారికే ఎక్కువ ప్రమాదమని తెలిపారు. అందుకే టీ/కాఫీ తాగాక పుక్కిలించడం లేదా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

News October 31, 2025

మహిళల ప్రపంచకప్: భారత్ గెలిచేసిందట!

image

మహిళల ODI వరల్డ్‌కప్‌ను టీమ్ ఇండియా గెలిచేసిందంటూ ‘వికీపీడియా’ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ‘50 ఓవర్లలో ఇండియా 326-5 రన్స్ చేసింది. సౌతాఫ్రికా 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది’ అని సైట్‌లో కనిపించింది. వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేయగలిగే ఓపెన్ ఎడిటింగ్ పాలసీ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. తర్వాత సరిదిద్దినట్లు సమాచారం. నవంబర్ 2న సౌతాఫ్రికా, భారత్ మధ్య నవీ ముంబై‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

News October 31, 2025

తెలంగాణలో IASల బదిలీ

image

*అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్
*గురుకుల సంక్షేమ కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
*రవాణా శాఖ కమిషనర్‌గా ఇలంబర్తి
*జీఏడీ పొలిటికల్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా E.శ్రీధర్‌
*ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషా
*మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా సీఎస్‌ రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు

News October 31, 2025

కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

image

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.

News October 31, 2025

శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

image

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.

News October 31, 2025

హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

image

హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.

News October 31, 2025

అందుకే బంగ్లాదేశ్‌ను వీడాను: షేక్ హసీనా

image

తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశాన్ని వీడానని బంగ్లాదేశ్ Ex PM షేక్ హసీనా తెలిపారు. తాను అక్కడే ఉండుంటే తనతోపాటు చుట్టూ ఉన్న వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నా. ఆగస్టులో జరిగినది హింసాత్మక తిరుగుబాటు. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది బూటకపు విచారణ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.

News October 31, 2025

ఒంటికొస్తే.. దర్జాగా ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లొచ్చు!

image

షాపింగ్స్ తదితర అవసరాల కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టాయిలెట్స్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ‘Sarais Act, 1867 Section 7(2)’ ప్రకారం దేశంలో ఫైవ్ స్టార్ హోటల్‌తో సహా ఏ హోటల్‌కైనా వెళ్లి టాయిలెట్స్ వాడుకునే హక్కు ఉందనే విషయం చాలామందికి తెలియదు. అలాగే అక్కడ నీరు తాగే హక్కు కూడా ఉంది. ప్రజల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ హక్కును అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. SHARE IT

News October 31, 2025

ప్రకృతి సేద్యం.. వరిలో ఆకుముడత, ఉల్లికోడు నివారణ

image

ప్రకృతి సేద్యం విధానంలో పండిస్తున్న వరిలో ఆకుముడత పురుగు నివారణకు తాడుతో మొక్కలపై లాగడం వల్ల ముడుచుకున్న ఆకులు తెరచుకొని పురుగులు కింద పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌(దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిదశలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఉల్లికోడు నివారణకు ఎకరానికి ఒక దీపపు ఎరను అమర్చుకోవాలి. 200 లీటర్ల నీటిలో అగ్నాస్త్రం 5 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి.

News October 31, 2025

ఆహార పదార్థాలు మాడు వాసన పోవాలంటే

image

ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వంట చేసినా ఆహారపదార్థాలు మాడిపోయి వాసన వస్తుంటాయి. కొన్ని చిట్కాలతో మాడు వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు. *బిర్యానీ, పలావ్ అండుగంటితే ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కోసి వండిన గిన్నెలోని మూలల్లో ఉంచాలి. పావుగంట తర్వాత ఆ ముక్కలు తీసేస్తే మాడు వాసన చాలా వరకు తగ్గుతుంది. *మాడిపోయిన కూరలు, ఇతర ఆహార పదార్థాలపై దాల్చినచెక్క పొడిని చల్లితే వాసనపోయి మంచి రుచి వస్తుంది.