India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: EAPCET ఫలితాలు సా.4 గంటలకు విడుదల కానున్నాయి. EAPCET అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ను ఒక్క క్లిక్తో సులభంగా షేర్ చేసుకోవచ్చు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్కు చేరుకోనున్నారు. రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో షా భేటీ కానున్నట్లు సమాచారం. ప్రస్తుత జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగామ, గద్వాల్, నాగర్కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంత్రివర్గ ఏర్పాటుతో కాస్త ఉపశమనం పొందినా BJP ముందు మరో 2 పనులు మిగిలి ఉన్నాయి. అవి లోక్సభ స్పీకర్ ఎన్నిక, BJP జాతీయాధ్యక్షుడి ఎంపిక. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేబినెట్లోకి రావడంతో ఆ పోస్టు ఖాళీగా మారనుంది. నూతన అధ్యక్షుడి ఎంపిక తమ చేతుల్లోని వ్యవహారమే కావడంతో ఆ టాస్క్ పెద్ద కష్టమేం కాదు. కానీ, లోక్సభ స్పీకర్ ఎన్నిక మాత్రం అలా కాదు. ఆ పదవి కోసం ఇటు TDP, అటు JDU పోటీలో ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ లండన్లో ఒక రోజు ముందుగానే రిలీజ్ కానుంది. అక్కడి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐమ్యాక్స్లో ప్రీమియర్ వేయనున్నారు. గతంలో ఇక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఒక రోజు ముందే విడుదలైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసుల వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ ప్రకటించారు. 2018 మార్చి 9 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
భారత్లో దోచుకుని తమ దేశానికి తరలించిన విలువైన పురాతన వస్తువులను విదేశీ ప్రభుత్వాల ఒత్తిడితో ఆంగ్లేయులు తిరిగిచ్చేస్తున్నారు. తాజాగా హిందూ కవి తిరుమంగై ఆళ్వార్కు చెందిన 500 ఏళ్లనాటి కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని ఓ ఆలయం నుంచి దొంగిలించారని నాలుగేళ్ల క్రితం UKలోని భారత హైకమిషన్ ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండుసార్లు జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు UGC చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. బోర్డు ఫలితాల్లో ఆలస్యం తదితర సమస్యల వల్ల జులై-ఆగస్టులో అడ్మిషన్ తీసుకోలేనివారు JAN-FEBలో ప్రవేశం పొందొచ్చన్నారు. కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించడం వల్ల పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని జగదీశ్ వెల్లడించారు.
ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 రోజులపాటు సాగే ఈ సెషన్లో తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం స్వీకారం చేస్తారు. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
మరోసారి రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్నాథ్ సింగ్ అగ్నిపథ్ స్కీమ్ సమీక్షకు తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సైనిక దళాల నుంచి అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభమైందట. ఆ సూచనల మేరకు స్కీమ్లో మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు జమ్మూకశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల ముప్పు పెరగడం, LAC, LOC వద్ద మౌలికవసతుల అభివృద్ధి వంటి అంశాలపై కూడా రాజ్నాథ్ దృష్టిసారించనున్నారు.
Sorry, no posts matched your criteria.