India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్మీడియట్లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. మొదటి ఏడాది అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనుంది.
ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించారు. ఆ యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందు వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో చాహల్ ఈ వార్తలను కొట్టిపారేశారు.
AP: అడ్మిషన్ల వేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఆపుతున్నట్లు ఫిర్యాదులు రావడంపై కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఫీజుల వసూలు, రీయింబర్స్మెంట్ వర్తించే వారినీ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వద్దనుకుంటే 5% మినహాయించి 15 రోజుల్లో కట్టిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 15న లాంచ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ రూపొందనుందనే దానిపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. అనిల్ డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న రిలీజ్ కానుండగా, చిరు ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.
వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్తో అవసరం లేకుండా పోల్స్లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.
AP: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నేడు సాయంత్రం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖలో రోడ్ షో చేయనున్నారు.
AP: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన జగన్ భవిష్యత్ కార్యాచరణపై ఒక్కో జిల్లా నేతలతో సమావేశం అవుతోన్న విషయం తెలిసిందే.
వచ్చే నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకొని షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. CTలో భారత్ తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్తో, 23న పాక్తో ఆడనుంది.
జట్టు అంచనా: రోహిత్(C), కోహ్లీ, గిల్, జైస్వాల్, శ్రేయస్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, షమీ, అర్ష్దీప్.
Sorry, no posts matched your criteria.