India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎట్టకేలకు 2023 గ్రూప్-2 రిజల్ట్స్ గత అర్ధరాత్రి విడుదలయ్యాయి. 905 పోస్టుల నోటిఫికేషన్కు APPSC 891 మందిని ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాపై HC ఆదేశాలతో 2 పోస్టులు పక్కన పెట్టగా, దివ్యాంగ, రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ పేర్కొంది.
– ఇక్కడ ఒక్క క్లిక్ చేసి ఈ రిజల్ట్ నేరుగా <
Share It

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్దీప్ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో.

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.

TG: పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12%లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాడి, గోల, చూర వంటి మలినాలు లేకుండా శుభ్రపరచిన పసుపును తేవాలని సూచించింది. NZB మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ప్రైవసీ ఉల్లంఘన <<18971131>>ఆరోపణలను<<>> WhatsApp మాతృసంస్థ Meta ఖండించింది. ‘మీ మెసేజ్లు ప్రైవేట్గానే ఉంటాయి. ఓపెన్ సోర్స్ సిగ్నల్ ప్రోటోకాల్తో ఎన్క్రిప్ట్ (హైడ్) చేస్తాం. మీ డివైజ్ నుంచి బయటకు వెళ్లే ముందే మెసేజ్లు ఎన్క్రిప్ట్ అవుతాయి. మీరు ఎవరికి పంపారో వాళ్లు మాత్రమే చదవగలరు. వాట్సాప్, మెటా వాటిని యాక్సెస్ చేయలేవు’ అని స్పష్టం చేసింది. కాగా Meta మెసేజ్లను చదవగలదని USలో దావా దాఖలవడంతో ఇలా స్పందించింది.

T20 WCలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోందని మాజీ కోచ్ ద్రవిడ్ అన్నారు. ‘ఇండియా వేరే లెవెల్లో ఆడుతోంది. సెమీస్కు ఈజీగా చేరుకుంటుంది. కానీ నా గత అనుభవాలను బట్టి చెబుతున్నా. ఆ రోజున ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది. ఎవరో ఒకరు మంచి ఇన్నింగ్స్ ఆడి మిమ్మల్ని అప్సెట్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ODI, T20ల్లో IND డామినెన్స్కు రోహిత్ శర్మ కారణమని ‘THE RISE OF THE HITMAN’ బుక్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు.

TG: మున్సిపల్ ఎన్నికల <<18974641>>నామినేషన్ల<<>> ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది.
నామినేషన్కు కావాల్సినవి: నామినేషన్ ఫారం, పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC/ఓటర్ ఐడీ/ఆధార్ జిరాక్స్), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాల్లో), నామినేషన్ డిపాజిట్, సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసులు), కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్, ఫొటోలు.
Sorry, no posts matched your criteria.