India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిన్న DCతో మ్యాచులో RR ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 20వ ఓవర్ చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, జురెల్ రెండో రన్ తీయడానికి నిరాకరించారు. ఆ తర్వాత చివరి బంతికి 1 రన్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో DC గెలిచింది. జురెల్ రెండో పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అవ్వకుండా RR గెలిచేదని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
IPLలో భాగంగా ఇవాళ MIతో SRH ఢీకొననుంది. కాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తేనే SRH గెలుస్తోంది. లేదంటే ఆ జట్టు గాడి తప్పుతోంది. గణాంకాలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఇన్నింగ్సులు ఆడారు. ఇందులో గెలిచిన 11 మ్యాచుల్లో 801 రన్స్ కొట్టారు. అదే ఓడిన 10 ఇన్నింగ్సుల్లో 145 పరుగులే చేశారు. గెలిచిన మ్యాచుల్లో జట్టు రన్ రేట్ 14.5 ఉండగా ఓడిన వాటిలో 8.78 మాత్రమే ఉంది.
హీరో కిచ్చా సుదీప్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. 2209లో జరిగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇందులో వినూత్నమైన సాహస యాత్రను ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనుప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వారు తెలిపారు.
TG: రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును CBIకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రవీణ్ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేళ్లలో తొలిసారి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్లే స్టూడెంట్స్ వీసాల్లో మొత్తం 25% తగ్గుదల కనిపించింది. అమెరికాకు వెళ్లేవారిలో 34%, బ్రిటన్కు 26%, కెనడాకు 32% మంది విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. ఆయా దేశాల్లో నిబంధనలు కఠినతరం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రా.7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడగా MI 13, SRH 10 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో MI ఏడో స్థానంలో, SRH తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచులో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
TG: హైదరాబాద్లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.
TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
Sorry, no posts matched your criteria.