News June 11, 2024

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

image

TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉంది. మరికొద్ది రోజుల్లో జలాశయం పూర్తిస్థాయిలో నిండనుంది.

News June 11, 2024

1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేవు: CBN

image

AP: రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజలు తమకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. ‘1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేవు. ఇప్పుడు 175కు 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. 93% స్ట్రైకింగ్ రేటు ఉంది. దేశ చరిత్రలోనే ఇది అరుదైన విజయం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కి 5 గెలిచాం. నూటికి నూరు శాతం మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పని చేశారు’ అని CBN అభినందించారు.

News June 11, 2024

మణిపుర్‌ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: RSS చీఫ్

image

మణిపుర్‌లో ఏడాదిగా హింసాత్మక వాతావరణం కొనసాగుతుండటంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పదేళ్లుగా ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. కానీ గత ఏడాది మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. దీనిని ఎవరు పట్టించుకుంటారు? తక్షణమే ఈ పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది’ అని RSS కార్యక్రమంలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో నేతలు హుందాగా వ్యవహరించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News June 11, 2024

నీట్ రద్దు చేయాలంటూ పిటిషన్లు.. నేడు విచారణ

image

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈనెల 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఏకంగా 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో పేపర్ లీకైందంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీంతో పరీక్షను రద్దు చేయాలంటూ 9 పిటిషన్లు దాఖలు కాగా.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News June 11, 2024

Xలో YCP, TDP నేతల ట్వీట్స్ వార్

image

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖలకు సహాయ మంత్రి కావడంపై కొందరు YCP సపోర్టర్లు సెటైర్లు వేస్తున్నారు. ‘25 ఏళ్లకు పైగా USలో గడిపిన వ్యక్తి భారత్‌లో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తాడట. భారత ప్రభుత్వం ఓ జోక్‌లా ఉంది’ అని Xలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై TDP శ్రేణులు స్పందిస్తూ.. ‘16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి CM అవ్వలేదా?’ అని కౌంటర్ ఇస్తున్నారు.

News June 11, 2024

BREAKING: మర్డర్ కేసులో ‘పోకిరి’ రీమేక్ హీరో అరెస్ట్

image

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్‌ను మైసూరు ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు తీసుకొస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దర్శన్ కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పోకిరి’ని రీమేక్‌ చేశారు.

News June 11, 2024

దూకుడు పెంచితే బందీలను కాల్చేయండి: హమాస్

image

ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచితే బందీలను చంపేయాలని హమాస్ నాయకత్వం ఫైటర్లను ఆదేశించింది. ఇటీవలే వీరి నుంచి నలుగురు బందీలను IDF రక్షించింది. ఈ క్రమంలో తమ సిబ్బంది, పాలస్తీనా పౌరులు మరణించారని ఆరోపిస్తూ ఉగ్ర సంస్థ ఈ ప్రకటన చేసింది. 2023 OCT 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందిని హమాస్ బంధించింది. వీరిని వేర్వేరు చోట్లకు తరలిస్తున్నట్లు డ్రోన్లు, శాటిలైట్లతో ఇజ్రాయెల్, USA సంయుక్త బృందం గమనిస్తోంది.

News June 11, 2024

జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్

image

AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.

News June 11, 2024

పెళ్లి గురించి సోనాక్షి చెప్పనేలేదు: శత్రుఘ్న సిన్హా

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. వివాహ విషయం ఆమె తనకు ఇంకా చెప్పలేదన్నారు. తన కూతురు సరైన నిర్ణయమే తీసుకుంటుందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన భార్య సంతోషంగా ఆశీర్వదిస్తామని శత్రుఘ్న తెలిపారు. కాగా ఈనెల 23న జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

News June 11, 2024

ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్

image

పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు. భార్య రితికా, కూతురు సమైరాతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ రేపు యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.