News September 30, 2024

హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ

image

AP: తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటూ TTD ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే శాంపిల్స్ సేకరణ, దాన్ని విశ్లేషించడంలో అధికారులు నిబంధనలు పాటించలేదని రాజశేఖరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సహా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోరారు. బెయిల్ మంజూరులో ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానన్నారు.

News September 30, 2024

CBN హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ట్రెండింగ్

image

తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు AP CM చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తవ్వకముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ‘CBN Should Apologize Hindus’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, హిందువులందరూ CBNని క్షమాపణ అడుగుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

News September 30, 2024

లాక్‌డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల!

image

కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.

News September 30, 2024

పాతబస్తీకి హైడ్రా వస్తే తీవ్ర పరిణామాలు: MIM ఎమ్మెల్యేలు

image

TG: హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పారు. బుల్డోజర్లు వస్తే తమ పైనుంచే వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు.

News September 30, 2024

ఈ ఊరిలో కుటుంబంలో ఒకరిగా నాగుపాములు!

image

మహారాష్ట్రలోని షోలాపూర్(D) షెట్పాల్ గ్రామంలో నాగుపాములు కుటుంబసభ్యుల్లా ఇంట్లోనే తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎంతో ప్రేమగా చూసుకుంటుండగా పిల్లలు వాటితో ఆడుకుంటారు. సర్పాలను శివుడి ప్రతిరూపాల్లా భావిస్తూ ఇంట్లో అవి ఉండే ప్రాంతాన్ని దేవాలయంగా పరిగణిస్తుంటారు. ఇప్పటివరకు ఈ విషసర్పాలు కాటేసిన ఘటనలు గ్రామంలో వినిపించలేదు. పాము-మనుషుల మధ్య ఉన్న బంధాన్ని చూసేందుకు పర్యాటకులు ఆ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.

News September 30, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

TG: DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.

News September 30, 2024

కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్

image

TG: మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో BRS పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖకు కలిగిన <<14234406>>అసౌకర్యానికి <<>>చింతిస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని హరీశ్ ట్వీట్ చేశారు.

News September 30, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.

News September 30, 2024

పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదు: లోకేశ్

image

AP: స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సాల్డ్ ప్రాజెక్టు ద్వారా HMలు, SGTలకు సమగ్ర శిక్షణ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నెలాఖరులోగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అందించాలని, పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News September 30, 2024

ఆ విద్యార్థి కోసం విచ‌క్ష‌ణాధికారాన్ని వాడిన సుప్రీంకోర్టు

image

ఓ విద్యార్థి కోసం సుప్రీంకోర్టు ఆర్టిక‌ల్‌ 142 ద్వారా త‌న విచ‌క్ష‌ణాధికారాన్ని ఉపయోగించింది. IIT ధ‌న్‌బాద్‌లో అడ్మిష‌న్ పొంద‌డానికి ₹17,500 కట్టలేకపోవడంతో UPకి చెందిన అతుల్ కుమార్ సీటు కోల్పోయారు. 3 నెల‌లపాటు పలు వేదికలను ఆశ్రయించినా ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగలేదు. చివరికి SCని ఆశ్రయించగా ప్ర‌తిభావంతుడైన ఆ విద్యార్థికి సీటు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విద్యార్థికి All The Best చెప్పింది.