News June 9, 2024

కేంద్రంలో TDP మంత్రుల శాఖలు ఇవేనా?

image

AP: కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) శాఖలపై ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిలో ఒకరికి ఐటీశాఖ, మరొకరికి ఉక్కు, గనులశాఖ దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మొదటి నుంచి పట్టుబడుతోన్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ జేడీయూకు కేటాయించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 9, 2024

కీలక పోరుకు ముందు స్టార్ ప్లేయర్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్

image

మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా పాకిస్థాన్ కీలక ప్లేయర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. కుడి పక్కటెముక గాయంతో అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్‌ వసిమ్‌ ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యారని పాక్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటర్ ఆజం ఖాన్ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ను పాక్ తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది.

News June 9, 2024

సంబరాలు చేసుకోండి: కిషన్ రెడ్డి

image

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని BJP రాష్ట్రాధ్యక్షుడు, MP కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని, సంకల్ప పత్రం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

News June 9, 2024

హజ్ యాత్రకు సానియా మీర్జా

image

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫ్యామిలీతో కలిసి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరారు. దివ్యమైన ఈ అవకాశాన్ని భగవంతుడు తనకు అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే అవకాశం లభించింది. కొత్త అనుభూతికి సిద్ధమవుతున్నా. నేను ఏవైనా తప్పులు చేసుంటే క్షమించాలని కోరుతున్నా. అల్లా నా ప్రార్థనలను ఆలకించి సన్మార్గంలో తీసుకెళ్తారని నమ్ముతున్నా’ అని ఆమె రాసుకొచ్చారు.

News June 9, 2024

రేపు ‘NBK 109’ నుంచి ఫైరింగ్ ట్రీట్?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న మూవీ నుంచి ఫైరింగ్ ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది. రేపు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతున్నట్లు సమాచారం. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10న మూవీ విడుదల కానున్నట్లు టాక్.

News June 9, 2024

కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి!

image

కేంద్ర మంత్రివర్గంలోకి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు అనూహ్యంగా చోటు దక్కింది. 1988లో బీజేపీలో కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1992-95లో ప.గో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 నుంచి 2014 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గానూ సేవలందించారు. కూటమి పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

News June 9, 2024

మోదీ 3.0: స్మృతి, అనురాగ్‌కు నిరాశే?

image

మోదీ 3.0 కేబినెట్‌లో కొందరు కీలక నేతలు లేనట్లు తెలుస్తోంది. మోదీ 2.0లో కీలక మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి నేతలకు ఈ సారి చోటు దక్కలేదని సమాచారం. అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఓడిపోయారు. హమిర్‌పుర్ నుంచి బరిలోకి దిగిన అనురాగ్ విజయం సాధించారు. కాగా వీరిద్దరితో పాటు మరికొందరికి మోదీ 3.0 కేబినెట్‌లో బెర్త్ దక్కలేదని చర్చ నడుస్తోంది. అయితే మరికాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.

News June 9, 2024

బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక పురోగతి

image

బంగ్లా MP అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఓ కాలువలో మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లో అరెస్టయిన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని గుర్తించారు. ఈ ఎముకలు MPవేనని భావిస్తున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపించనున్నారు. అంతకుముందు MP హత్య జరిగిన ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో మాంసపు ముద్దను పోలీసులు గుర్తించి DNA పరీక్షలకు పంపారు.

News June 9, 2024

పనుల్ని సమయానికి పూర్తి చేయండి: మోదీ

image

కేబినెట్‌లో చోటు దక్కిన ఎంపీలకు ప్రధాని మోదీ తేనేటి విందు ఏర్పాటు చేశారు. పరిపాలనపై దృష్టి పెట్టాలని, పనుల్ని సమయానికి పూర్తి చేయాలని వారికి సూచించారు. నేడు ప్రధానిగా మోదీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈసారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనా. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ బీజేపీ వద్దే కొనసాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News June 9, 2024

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే..

image

సంఘ్ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 14లో అంబర్‌పేట్ నుంచి MLAగా గెలిచారు. 2019లో SEC MPగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు.