India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.
విదేశీ కంపెనీల దర్యాప్తులో గౌతమ్ అదానీ కంపెనీలను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సెలక్టివ్గా టార్గెట్ చేయడమేంటని రిపబ్లికన్ లామేకర్ లాన్స్ గూడెన్ ప్రశ్నించారు. అమెరికా మిత్రదేశాలతో బంధాలను సంక్లిష్టం చేయొద్దని, విదేశాల్లో వదంతులను వేటాడటం మానేసి స్వదేశంలో దారుణాలను అరికట్టాలని జస్టిస్ డిపార్ట్మెంటుకు సూచించారు. ఒకవేళ అదానీపై అభియోగాలు నిజమని తేలినా భారత్లో అమెరికా ఏం చేయగలదని ప్రశ్నించారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. గతంలో ఆయన అఫ్గాన్కు బ్యాటింగ్ కోచ్గానూ పనిచేశారు. ఆయనకు PSL, అబుదాబి T10 లీగ్లో కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్VSన్యూజిలాండ్ మ్యాచుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు.
ఇండియాలో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో మార్స్ పెట్కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారంది.
TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.
AP: విశాఖ వస్తున్న PM మోదీతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ‘చంద్రబాబు గారూ మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని PMతో పలికించండి’ అని ట్వీట్ చేశారు.
పండుగ సందర్భంగా ప్రజలు రైళ్ల ద్వారా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ట్రైన్లలో వెళ్లేవారు తప్పనిసరిగా ఓ నంబర్ సేవ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9881193322ను సేవ్ చేసుకొని వాట్సాప్లో Hi అని మెసేజ్ చేయాలి. ఇందులో PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ షెడ్యూల్ & కోచ్ పొజిషన్, ముఖ్యంగా ట్రైన్లో ఎవరైనా ఇబ్బందిపెడితే రైల్ మదద్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అధికారులు వస్తారు. SHARE IT
AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. కడప జైలు నుంచి రిమ్స్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కడప సైబర్ క్రైమ్ PSకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిపై జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్, అనితపై ఇతను సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదయ్యాయి.
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డుప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రాంచరణ్ పరిహారం అందజేశారు. RTGS ద్వారా పేమెంట్ చేయగా, దానికి సంబంధించిన వివరాలను చెర్రీ ఫ్యాన్స్ బాధితుల తల్లిదండ్రులకు అందించారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ రోడ్డుప్రమాదంలో మరణించారు. వీరికి పవన్, రాంచరణ్, దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.