India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశుకాపర్లు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించింది.
టీ 20 వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లకు గాని ఆ జట్టు తొలి బౌండరీ సాధించలేకపోవడం గమనార్హం. అంతకుముందు బార్ట్మాన్ 4, నోకియా 2, ఎన్సన్ 2 వికెట్లతో చెలరేగడంతో డచ్ టీమ్ 20 ఓవర్లలో 103/9 పరుగులకే పరిమితమైంది.
TG: ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. రేపు మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తున్న సందర్భంగా హాజరుకావాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమానికి దేశంలోని సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ పార్టీల అధ్యక్షులు, ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. అలాగే విదేశీ అతిథులకు కూడా ఆహ్వానం పంపారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా మరో 65 జబ్బులకు చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నెముకకు సంబంధించిన అధునాతన చికిత్స విధానాలను ఈ పథకంలో చేర్చింది. వైద్య నిపుణుల సూచనతో ప్రస్తుత ప్యాకేజీలో ఉన్న 1,375 విధానాల ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.497.29 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై గతంలో కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులకు పోలీసులు కాపలాగా ఉంటే.. సాధారణ రైతన్నకు రామోజీ ‘ఈనాడు’ అనే ఆయుధంతో రక్షణగా ఉంటారని ఆ కార్టూన్ ఉద్దేశం. రామోజీ నేడు కన్నుమూయడంతో నెటిజన్లు దీన్ని షేర్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సైట్లలో మాజీ సీఎం జగన్ ఫొటోలతో సహా పాత మంత్రుల ఫొటోలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో కోడ్ వల్ల తీసేసిన ఫొటోలను తిరిగి పెట్టొద్దని అధికారులను ఆదేశించింది.
TG: MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించిన ఐసెట్-2024 పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. కీతో పాటు క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను కాకతీయ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచింది. ఐసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్లు ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్లను చూసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై జూన్ 9 సా.5 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కాగా, ఫలితాల విడుదల తేదీ ఖరారు కాలేదు. icet.tsche.ac.in/
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమయంలో పాకిస్థాన్తో మ్యాచు అనగానే ఎలాంటి ఒత్తిడి ఉందో ఇప్పుడు అలాగే ఉందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ప్రత్యర్థి, పిచ్ సమస్య కాదని ఎక్కడైనా మంచి క్రికెట్ ఆడటం ముఖ్యమని మీడియాతో చెప్పారు. టీ20ల్లో ప్రతి ఓవర్కు మ్యాచ్ మారుతుందన్నారు. NYలో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రేపు రాత్రి 8 గంటలకు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్, రజత్ భార్గవ రానున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించనున్నారు. కాగా ఇప్పటికే 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12న ఉదయం 9.27 గంటలకు CBN ప్రమాణం చేస్తారని ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగుతుందని తెలిపింది. తొలుత ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేస్తారని టీడీపీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.