News September 30, 2024

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించామని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. అప్పటివరకు ఇన్వెస్టిగేషన్‌పై స్టే విధించింది.

News September 30, 2024

ALERT.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

image

☞ ICICI డెబిట్ కార్డుతో గత త్రైమాసికంలో రూ.10000 వాడితే ప్రస్తుత త్రైమాసికంలో 2 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు
☞ HDFC క్రెడిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పత్తిపైనే రివార్డు రిడీమ్ చేసుకోవచ్చు
☞ పన్ను రిటర్నుల్లో ఇకపై ఆధార్ నంబర్ మాత్రమే వాడాలి
☞ F&O ట్రేడింగ్‌లో ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిస్తే ప్రీమియంపై STTని 0.1%, ఫ్యూచర్స్ విభాగంలో STT 0.02% చెల్లించాలి.

News September 30, 2024

ఇసుక రవాణా ఛార్జీల సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి కొల్లు

image

APలో ఇసుక సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే NGT నిబంధనల ప్రకారం రీచుల్ని నిలిపివేశామని చెప్పారు. ఇకపై బోట్ మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

News September 30, 2024

నాలుగో రోజు ముగిసిన ఆట

image

భారత్-బంగ్లా రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. అశ్విన్‌కే 2 వికెట్లు పడ్డాయి. బంగ్లా మరో 26 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా 233 రన్స్‌కు ఆలౌటైంది.

News September 30, 2024

మంగళగిరిలో స్కిల్ సెన్సెస్ సర్వే

image

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సెస్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో దీనిని చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు, స్కిల్ డెవలెప్‌మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది సర్వే చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు.

News September 30, 2024

నివాస ఇళ్లను హైడ్రా కూల్చదు: రంగనాథ్

image

TG: పేదలు, మధ్య తరగతి ప్రజల జోలికి హైడ్రా వెళ్లదని, ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని చెప్పారు. ప్ర‌కృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌, చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడమే హైడ్రా పని అన్నారు.

News September 30, 2024

హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

image

కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.

News September 30, 2024

PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం

image

దేశంలో EVల వినియోగాన్ని మ‌రింత ప్రోత్స‌హించ‌డానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్‌లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేప‌టి నుంచి(మంగ‌ళ‌వారం) ఈ స్కీం అమ‌లులోకి రానుంది.

News September 30, 2024

కాంగ్రెస్ వాళ్లు అటు వైపు వెళ్లకండి: KTR

image

TG: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విననన్ని బూతులు తిడుతున్నారు. దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్లకండి. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. మీకు ఇదే నా సూచన. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలోకి కూడా వెళ్లలేరు’ అని అన్నారు.

News September 30, 2024

ప్రభుత్వానికి లేఖ రాయనున్న ‘అప్సా’

image

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) రద్దు అంశాన్ని పున:పరిశీలించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇటీవల అప్సా గుర్తింపు రద్దుపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ప్రస్తుతం అప్సా రద్దు ఫైల్ సీఎం వద్దకు చేరగా, రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.