News October 31, 2025

గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN

image

AP: రాజధాని అమరావతి పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ ప్రాజెక్టులపై మంత్రి నారాయణ, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ

image

AP: ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించాయి.

News October 31, 2025

ఫైనల్లో వర్షం పడితే..?

image

ఆదివారం భారత్-సౌతాఫ్రికా మధ్య ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుకు 63% వర్షం ముప్పు ఉందని IMD తెలిపింది. ఎల్లుండి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వాన కారణంగా మ్యాచ్ జరగకపోతే గ్రూప్ స్టేజీలో టాప్‌లో నిలిచిన సౌతాఫ్రికానే విజేతగా ప్రకటిస్తారు. దీంతో వర్షం పడొద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

News October 31, 2025

RSSను బ్యాన్ చేయాల్సిందే: ఖర్గే

image

దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం పని చేశారని చెప్పారు. దేశంలో చాలా సమస్యలకు BJP-RSSనే కారణమని ఆరోపించారు. 1948లో గాంధీ హత్య తర్వాత RSSను పటేల్ నిషేధించారని చెప్పారు.

News October 31, 2025

విడిపోతున్నారా? పిల్లలు జాగ్రత్త

image

దంపతులు తమ విడాకుల విషయాన్ని చెబితే పిల్లలు ఎంతోకొంత ఒత్తిడికి గురవడం సహజం. కొందరు చిన్నారులు పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటే.. మరికొందరికి సమయం పడుతుంది. కాబట్టి త్వరగా అర్థం చేసుకోమని, మారమని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఆయా పరిస్థితులకు తగినట్లుగా అడ్జస్ట్ అయ్యే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఓర్పు, నేర్పు వస్తుందంటున్నారు నిపుణులు.

News October 31, 2025

ఆస్పత్రికి వచ్చిన అరగంటలోపే వైద్య సేవలు

image

AP: రోగులకు సేవలందించడంలో వైద్య శాఖ మరో ముందడుగు వేసింది. ఆస్పత్రికి వచ్చిన 26 ని.లోనే వైద్యం అందిస్తోంది. గతంలో ఈ టైమ్ 42ని.గా ఉండేది. గత 6నెలల్లో 4కోట్ల మందికి పైగా OP సేవలందుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు 83% నుంచి 92%కి పెరిగింది. VSP KGH, KRNL, RJY GGHలు అగ్రస్థానంలో ఉన్నాయి. APR-SEP వరకు వైద్యశాఖ పనితీరు రిపోర్టులను మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వాటిని బట్టి ర్యాంకులు ఇస్తారు.

News October 31, 2025

చొరబాటుదారుల్ని వెనక్కి పంపిస్తాం: మోదీ

image

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ వెనక్కి పంపిస్తామని PM మోదీ పునరుద్ఘాటించారు. చొరబాట్లు దేశ ఐక్యతకు ముప్పుగా మారుతాయని, గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. చొరబాట్లను అడ్డుకొనే వారికి అడ్డుపడుతూ కొన్ని పార్టీలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ‘దేశ భద్రతకు రిస్క్ ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో పడినట్లే’ అని ‘ఏక్తాదివస్’లో PM హెచ్చరించారు.

News October 31, 2025

భారత్‌కు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.

News October 31, 2025

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

image

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.