India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో టీచర్ల బదిలీకి బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందు బొత్స మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సుల ఒత్తిళ్లతో ఈ బదిలీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎలాంటి బదిలీలు చేయవద్దంటూ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ అన్ని జిల్లాల DEOలకు ఆదేశాలు జారీ చేశారు.
AP: సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సాయంత్రంలోగా కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవు పెట్టారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, పురందీశ్వరికి కంగ్రాట్స్ చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.
దేశవ్యాప్తంగా వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 63,72,220 ఓట్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 8,97,323 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలోని 17 స్థానాల్లో మొత్తం 1,02,654 మంది ఓటర్లు (0.47% మంది) నోటాకు జై కొట్టారు. ఇక ఏపీలో నోటా ఓట్ల సంఖ్య 3,98,777. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకుంటారు.
కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి వర్గ కూర్పులో భాగంగా నాలుగు మంత్రిత్వ శాఖలను తామే అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలను తీసుకోవాలని చూస్తోందట. నితీశ్ నేతృత్వంలోని JD(U) రైల్వేను టార్గెట్ చేసిందట. కీలక శాఖల్లో సహాయ మంత్రి పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది.
AP: విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎన్నికలకు వెళ్లిన తాము ఉత్తరాంధ్ర ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు. APలో విశాఖకు దీటైన నగరం లేదు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు కొనసాగించాలి. ఎన్నికల్లో ఓటమి, పాలనలో తప్పులపై పార్టీలో సుదీర్ఘ చర్చ జరగాలి. ఏడాదిలో హామీలు అమలు చేయకపోతే NDA ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని హెచ్చరించారు.
TG: ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు BJPకి అండగా నిలిచారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ‘CM రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు ఆయన గతంలో MPగా గెలిచిన మల్కాజిగిరిలోనూ BJP సత్తా చాటింది. మరో 6-7 సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్కు బలమైన మెదక్లోనూ BJP గెలుపొందింది’ అని మీడియాతో పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
APకి కొత్త సీఎస్గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం APSPDCL ఛైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ను CSగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానూ ఆయన వ్యవహరించారు.
NDA ప్రభుత్వంలో కీలకంగా మారనున్న చంద్రబాబు లోక్సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ LSకి అధిపతిగా ఉండనుండగా ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు విషయంలో ఆయనదే తుది నిర్ణయం ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం ఉండనుండటంతో ఈ పోస్టుకు డిమాండ్ నెలకొంది. 1998-2002 మధ్య కూటమిలో ఉన్న TDPకి లోక్సభ స్పీకర్ పదవి వరించింది. ఆ సమయంలో GMC బాలయోగి స్పీకర్గా వ్యవహరించారు.
Sorry, no posts matched your criteria.