News September 30, 2024

ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు

image

ల‌డ్డూ వివాదంలో AP ప్ర‌భుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. Sep 25న FIR న‌మోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచార‌ణ పూర్త‌వ్వ‌క‌ముందే మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా మీడియా ముందు ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. ల‌డ్డూలు రుచిగా లేవ‌ని భ‌క్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

News September 30, 2024

లడ్డూ వివాదం.. SC వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

News September 30, 2024

సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR

image

TG: ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.

News September 30, 2024

బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం: KTR

image

TG: ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నాతో సహా మా నేతలంతా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్‌ను కూల్చాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు.

News September 30, 2024

చరిత్ర సృష్టించిన బుమ్రా

image

బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచారు. దీంతో పాటు జేమ్స్ అండర్సన్‌ను అధిగమించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కారు.

News September 30, 2024

జానీ మాస్టర్‌కు దక్కని ఊరట

image

TG: అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు సమాచారం.

News September 30, 2024

‘సత్యం సుందరం’ సినిమా నుంచి 18 నిమిషాలు కట్!

image

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, సినిమాలోని 18 నిమిషాలను ట్రిమ్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కట్ చేసిన వెర్షన్ ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. కాగా, సెకండ్ ఆఫ్‌లో కార్తీ & అరవింద్‌స్వామి మధ్య జరిగే సుదీర్ఘ సంభాషణను ట్రిమ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.

News September 30, 2024

WTCలో చరిత్ర సృష్టించిన అశ్విన్

image

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో భారత బౌలర్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్(WTC)లో 50+ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇతను 2019-21లో 71, 2021-23లో 61, 2023-25లో 50* వికెట్లు తీశారు. నాథన్ లియాన్, పాట్ కమిన్స్, టిమ్ సౌథీ రెండు సీజన్లలో 50+ వికెట్లు పడగొట్టారు. కాగా ఓవరాల్‌గా WTCలో 187 వికెట్లతో లియాన్ టాప్‌లో ఉండగా, అశ్విన్(182) రెండో స్థానంలో ఉన్నారు.

News September 30, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ న‌టుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేరళ పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖ‌లు చేసిన‌ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ వాయిదా

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో దర్యాప్తు కొనసాగించాలా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని అడిగింది.