India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.
పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. దీనితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మ్యాడ్ స్క్వేర్, సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ ఓటీటీ రైట్స్ను కూడా సొంతం చేసుకున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.
☛ వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు
☛ ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి, 2023-24లో కనీసం 20 రోజులు పనులు చేసిన వారు అర్హులు.
☛ ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాన్ని యూనిట్గా గుర్తిస్తారు. లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికీ భూమి ఉండకూడదు. ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు.
☛ ₹6వేల చొప్పున రెండు విడతల్లో ₹12,000 ఖాతాల్లో జమ
☛ ఈనెల 26న తొలి విడత అమలు
అదానీ షేర్లలో నేడు సంక్రాంతి కళ కనిపిస్తోంది. గ్రూప్ షేర్లు నేడు గరిష్ఠంగా 19% వరకు ఎగిశాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే లంచం కేసులో గౌతమ్ అదానీ, సంబంధీకులకు క్లీన్చిట్ ఇస్తారన్న వార్తలే ఇందుకు కారణం. ప్రస్తుతం అదానీ పవర్ 19, గ్రీన్ ఎనర్జీ 13, ఎనర్జీ సొల్యూషన్స్ 12, టోటల్ గ్యాస్ 9, NDTV 8, అదానీ ఎంటర్ప్రైజెస్ 8, APSEZ 5, ACC, అంబుజా సిమెంట్స్ 4%, సంఘి ఇండస్ట్రీస్ 3.2% మేర ఎగిశాయి.
భారత నావికాదళం అమ్ములపొదిలో మరో 2 కీలక యుద్ధ నౌకలు, జలాంతర్గామి చేరనున్నాయి. INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్షీర్ను ప్రధాని మోదీ బుధవారం ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ప్రారంభించనున్నారు. రక్షణ రంగ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనుకుంటున్న భారత ఆశయ సాధనలో వీటి ప్రారంభం కీలక ముందడుగు. ఇందులో INS సూరత్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక యుద్ధ నౌకలలో ఒకటి.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ.74 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంక్రాంతి బ్లాక్బస్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. కాగా ఈ మూవీ తొలి రోజైన ఆదివారం రూ.56 కోట్లు వసూలు చేసింది.
తమిళ హీరో శివకార్తికేయన్ ఇటీవల వచ్చిన అమరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఫ్యామిలీ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరోకు భార్య ఆర్తి, ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శివకార్తికేయన్, ఆర్తి 2010లో పెళ్లి చేసుకున్నారు.
సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కష్టకాలం మొదలైనట్టే! 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.