News June 4, 2024

సంచలనం.. జైలు నుంచి పోటీ చేసి గెలిచాడు

image

‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సంచలన విజయం సాధించారు. ఖడూర్‌ సాహిబ్‌ నుంచి జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన పాల్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. మాజీ PM ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖస్లా(స్వతంత్ర) ఫరీద్‌కోట్‌లో 75 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News June 4, 2024

బొత్స ఫ్యామిలీ ఆలౌట్!

image

వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణకు ఓటమి తప్పలేదు. ఆయన భార్య, సోదరుడు సైతం పరాజయం పాలయ్యారు. చీపురుపల్లిలో కళా వెంకట్రావు చేతిలో 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓడిపోయారు. గజపతినగరంలో పోటీ చేసిన ఆయన సోదరుడు అప్పలనర్సయ్య 25,301 ఓటమి చెందారు. విశాఖ MPగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ.. టీడీపీ అభ్యర్థి భరత్ చేతిలో 4,96,063 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టారు.

News June 4, 2024

రేపు కల్కి నుంచి అప్డేట్

image

ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమా నుంచి రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ రానున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ట్రైలర్ గురించే కావొచ్చని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News June 4, 2024

TDP MLAగా గెలిచిన అంగన్‌వాడీ టీచర్

image

AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా నిలిచింది. వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శిరీష 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. గతంలో అంగన్‌వాడీ టీచర్‌గా ఆమె.. ఇప్పుడు MLAగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

News June 4, 2024

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలుపు

image

AP: మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ఘన విజయం సాధించారు. దీంతో దాదాపు 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది. చివరగా 1985లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ ఇక్కడ ఓటమిపాలైంది. చివరకు 2024 ఎన్నికల్లో లోకేశ్ గెలుపొంది రికార్డు సృష్టించారు.

News June 4, 2024

ప్రజా తీర్పు-24: గెలిచినా ఓటమే, ఓడినా గెలుపే

image

ఈసారి దేశ ఓటర్లు ఇరుపక్షాలకు విచిత్ర తీర్పు ఇచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న NDA కౌంట్ 300 లోపే ఆగింది. మ్యాజిక్ ఫిగర్ 272 దాటినా, సొంతంగా 400 సీట్లు గెలుస్తామన్న BJPకి ఈ తీర్పు ఓ పాఠం. 2014, 19 ఘన విజయాలతో పోలిస్తే ఈ ఫలితం ఓ రకంగా ఓటమే. పదేళ్లుగా పరాభవం చూసిన కాంగ్రెస్ సొంతంగా 100+ MP స్థానాలు గెలిచింది. INDIA కూటమి 233 సీట్లతో అధికారానికి ఒక్క అడుగు ముందు ఆగినా నైతికంగా వారికిది విజయమే.

News June 4, 2024

తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది: మోదీ

image

వివిధ రాష్ట్రాల్లో BJP సాధించిన విజయాలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో మన నంబర్ డబుల్ అయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ తదితర రాష్ట్రాల్లో దాదాపు క్లీన్‌స్వీప్ చేశాం. బీజేపీని ఆదరించిన ఏపీ, ఒడిశా ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీలో చంద్రబాబు అద్భుత ఫలితాలు సాధించారు. అరుణాచల్, ఏపీ, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం’ అని మోదీ వివరించారు.

News June 4, 2024

మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది: మోదీ

image

ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సంగ్రామంలో సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ గెలిచింది. మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. జమ్మూకశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం’ అని మోదీ తెలిపారు.

News June 4, 2024

కరణంను ముంచిన ఆమంచి!

image

AP: చీరాలలో TDP అభ్యర్థి ఎంఎం కొండయ్య 20,558 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మొత్తం 71,360 ఓట్లు సాధించారు. ఇక 50,802 ఓట్లతో YCP అభ్యర్థి కరణం వెంకటేశ్ రెండో స్థానంలో నిలిచారు. కరణం గెలుపును కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అడ్డుకున్నారు. ఆమంచికి మొత్తం 41,295 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లు కలుపుకుంటే కరణం వెంకటేశే 20వేల ఓట్ల మెజార్టీతో కొండయ్యపై గెలిచేవారు.

News June 4, 2024

అమరావతికి పునర్వైభవం?

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనుండటంతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. 2014లో గెలుపొందిన తర్వాత బాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి సచివాలయం, హైకోర్టును నిర్మించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని తరలింపును తెరపైకి తెచ్చారు. మళ్లీ CBN అధికారంలోకి రానుండడంతో అమరావతికి పూర్వ వైభవం లభిస్తుందని, రాజధాని పనులు ఊపందుకుంటాయని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.