News June 4, 2024

అమరావతికి పునర్వైభవం?

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనుండటంతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. 2014లో గెలుపొందిన తర్వాత బాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి సచివాలయం, హైకోర్టును నిర్మించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని తరలింపును తెరపైకి తెచ్చారు. మళ్లీ CBN అధికారంలోకి రానుండడంతో అమరావతికి పూర్వ వైభవం లభిస్తుందని, రాజధాని పనులు ఊపందుకుంటాయని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

News June 4, 2024

సౌత్ బ్యాటిల్: బీజేపీ 30 vs కాంగ్రెస్ 33

image

మొన్నటి వరకు బీజేపీ అంటే నార్త్ పార్టీ అనేవాళ్లు. ఇప్పుడది సౌత్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం 131 సీట్లున్నాయి. ఇక్కడ బీజేపీ 30, కాంగ్రెస్ 33 చోట్ల జెండా పాతాయి. TDP, YCP, DMK, ADMK, JSP, ఇతరులు కలిసి 68 సీట్లు సాధిస్తున్నారు. ఇక NDAకు 49, ఇండియాకు 76 వస్తున్నాయి. 2019లో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ చెరో 29 సీట్లు గెలవగా ఇతరులు 72 కైవసం చేసుకున్నారు.

News June 4, 2024

పవన్ విజయంపై రేణూదేశాయ్ ట్వీట్

image

ఏపీ ఫలితాల్లో జనసేన ఘనవిజయం సాధించడంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ఆద్య, అకీరాలు సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఏపీ ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆద్య, అకీరాలు ఉన్న ఫొటోలను పంచుకున్నారు.

News June 4, 2024

బీజేపీని నిలబెట్టిన ఆ రెండు రాష్ట్రాలు!

image

నువ్వా-నేనా అన్న‌ట్టు సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డం వెనుక గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు కీల‌క‌పాత్ర పోషించాయి. గుజ‌రాత్‌లోని 25 స్థానాల్లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ద్వారా సొంతంగా 238 సీట్లు సాధించ‌గ‌లిగింది. ఈ రెండు రాష్ట్రాలే ఇప్పుడు ఎన్డీయేని మ‌ళ్లీ అధికారానికి చేరువ చేశాయి. 2019 ఫ‌లితాలే ఇక్క‌డ పున‌రావృతమ‌య్యాయి.

News June 4, 2024

జగన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం

image

AP: వైఎస్ జగన్ సీఎం పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. ఆ తర్వాత ఆయన మాజీ సీఎం కానున్నారు.

News June 4, 2024

APకి పూర్వ వైభవం తీసుకొస్తాం: చంద్రబాబు

image

ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. ‘మోదీ గారికి ధన్యవాదాలు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధించినందుకు ప్రజల తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కూటమిపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. మన ప్రజలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకొస్తాం’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 4, 2024

APలో అత్యధిక మెజారిటీ ఈయనకే..

image

విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సంచలన విజయం నమోదు చేసింది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై 94,058 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఇక అదే జిల్లాలోని భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ.

News June 4, 2024

ప్రజలను రక్షించే బాధ్యత మాపై ఉంది: లోకేశ్

image

AP: గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి ప్రజలను రక్షించే బాధ్యత తమపై ఉందని టీడీపీ నేత లోకేశ్ స్పష్టం చేశారు. ‘గత ఐదేళ్లలో ఎన్నో హామీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు వారిని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నేతలపై విచారణ కమిటీ వేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.

News June 4, 2024

చంద్రబాబు, పవన్‌కు కేసీఆర్ అభినందనలు

image

ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

News June 4, 2024

NEET UG ఫలితాలు రిలీజ్.. 89 మందికి 720/720

image

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET యూజీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి అప్లికేషన్ నంబర్, DOBతో ఫలితాలు తెలుసుకోవచ్చు. MBBS, BDS, BSMS, BUMS BHMS కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈసారి 89 మందికి 720/720 మార్కులు వచ్చాయి. దీంతో లాటరీ విధానం ద్వారా AIIMS ఢిల్లీలో సీటు ఎవరికి వస్తుందో నిర్ణయిస్తారు. గతేడాది ఇద్దరికి మాత్రమే 720 మార్క్స్ వచ్చాయి.