News June 4, 2024

అసెంబ్లీకి ఓడారు.. పార్లమెంట్‌కు గెలిచారు

image

TG: 2023లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన ఇద్దరు BJP అభ్యర్థులను 6నెలల్లోనే ప్రజలు పార్లమెంట్‌కు పంపించారు. దుబ్బాకలో BJP అభ్యర్థిగా ఓడిపోయిన రఘునందన్‌రావుకు అధిష్ఠానం మెదక్ సీటు ఇవ్వగా ప్రజలు ఆదరించడంతో గెలుపొందారు. ఇటు ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చెందారు. అయినా వెనుకడుగు వేయకుండా మల్కాజిగిరి MP స్థానానికి పోటీ చేయగా ప్రజలు ఆయనను దీవించారు.

News June 4, 2024

అభివృద్ధి పథం వైపు సాగుదాం: సీఎం రేవంత్

image

ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. ‘ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News June 4, 2024

ఉమ్మడి విశాఖలోనూ కూటమిదే విజయం

image

ఉమ్మడి విశాఖలో కూటమి 15 స్థానాలకుగాను 13 స్థానాల్లో విజయం సాధించింది. భీమిలి, చోడవరం, గాజువాక, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ- తూర్పు, విశాఖ-పశ్చిమలో TDP అభ్యర్థులు గెలుపొందారు. విశాఖ-ఉత్తరంలో బీజేపీ.. విశాఖ-దక్షిణం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలిలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలిచిన YCP ఇప్పుడు అరకు, పాడేరులో మాత్రమే గెలుపొందింది.

News June 4, 2024

ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్!

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్(29), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), అరుణాచల్ ప్రదేశ్(2), త్రిపుర(2), అండమాన్ నికోబార్(1)లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలుచుకుంది. మిగతా స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.

News June 4, 2024

నెల్లూరులో గెలిచింది వీరే!

image

AP: నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. ఆత్మకూరు- ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు- పాశం సునీల్, కావలి-కావ్య కృష్ణారెడ్డి, కోవూరు-వేమిరెడ్డి ప్రశాంతి, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు సిటీ-నారాయణ, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూళ్లూరుపేట-నెలవల విజయశ్రీ, ఉదయగిరి-కాకర్ల సురేశ్, వెంకటగిరి-కురుగొండ్ల రామకృష్ణ.

News June 4, 2024

అక్కడా.. ఇక్కడా 8 సీట్లే

image

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రఫ్ఫాడించింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో జెండా పాతింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి NO. 8 బాగా కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఈ పార్టీ 4 స్థానాల్లోనే గెలిచింది.

News June 4, 2024

పొత్తుల చుట్టూనే రాజకీయాలు

image

లోక్‌సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో పొత్తుల వైపు దృష్టి సారించాయి. ఇప్పటికే తమతో పొత్తు ఉన్న పార్టీలను కాపాడుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. ఓ వైపు ఇండియా కూటమి BJD, జేడీ(యూ), టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ NDAలోని పార్టీలతో ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు చేసి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

News June 4, 2024

కర్ణాటకలో బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం

image

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. జేడీ(ఎస్) 2 చోట్ల గెలుపొందింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఎం ఒక చోట గెలిచి, మరో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. డీఎంకే 22, VCK 2, సీపీఐ 2 చోట్ల గెలవగా, MDMK, IUML తలో చోట ఆధిక్యంలో ఉన్నాయి.

News June 4, 2024

CM పదవికి రాజీనామా చేసిన జగన్

image

AP: వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు. కాగా 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. ఇప్పటివరకు 9 సీట్లలోనే విజయం సాధించింది.

News June 4, 2024

జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్

image

AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.