News April 22, 2025

గ్రామీణ డాక్ సేవక్: సెకండ్ లిస్టు విడుదల

image

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారి రెండో జాబితా విడుదలైంది. <>https://indiapostgdsonline.gov.in/<<>>లో లిస్టు అందుబాటులో ఉంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1,215, టీజీలో 519 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెకండ్ లిస్టులో AP నుంచి 702 మంది, TG నుంచి 169 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు మే 6లోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవ్వాలి. కాగా గత నెలలో తొలి జాబితా విడుదలైంది.

News April 22, 2025

DCvsLSG: బదులు తీర్చుకుంటుందా?

image

IPL: లక్నో వేదికగా ఇవాళ LSG, DC తలపడనున్నాయి. స్టార్ ప్లేయర్లు పంత్, రాహుల్ తమ మాజీ జట్లతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఢిల్లీ ఏడు మ్యాచ్‌ల్లో 5, లక్నో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా చెరో 3 విజయాలు సాధించాయి. కాగా ఈ సీజన్‌ ఆరంభంలో లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఢిల్లీ విజయం సాధించింది. మరి లక్నో ఇవాళ బదులు తీర్చుకుంటుందా? COMMENT

News April 22, 2025

ALERT: నేడు, రేపు వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఎండలు కూడా ముదురుతున్నాయి. ఆదిలాబాద్‌లో నిన్న సాధారణం కన్నా 2.9 డిగ్రీలు పెరిగి 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

News April 22, 2025

డిసెంబర్‌లో ఫర్జీ-2 షూటింగ్ షురూ?

image

రాజ్-డీకే దర్శకత్వంలో ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ సీక్వెల్‌ షూటింగ్ DECలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దొంగ నోట్ల కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ 2023లో ప్రైమ్‌ వీడియోలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్, రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి, భువన్ అరోరా కీలక పాత్రలు పోషించారు.

News April 22, 2025

గురుకుల కాలేజీలు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాష్ట్రంలోని 130 BC గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్ పాసైన విద్యార్థులు నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MPC, BiPC, CEC, HEC, MECలతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర కోర్సులు ఉన్నాయి. బాలురకు 11,360 సీట్లు, బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://mjptbcwreis.telangana.gov.in/

News April 22, 2025

‘ఛావా’ మరో రికార్డ్

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ-2, పుష్ప-2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్‌గా రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లోనూ నంబర్-1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

News April 22, 2025

గిల్-సాయి జోడీ అదుర్స్

image

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.

News April 22, 2025

నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

image

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.

News April 22, 2025

నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

image

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

News April 22, 2025

మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

image

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.