India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు పెరగడం వెనక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చారు. కాగా ప్రస్తుతం ఎన్డీఏ 293, ఇండియా కూటమి 232 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. మీ నాయకత్వం, దార్శనికత చాలా కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకం. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, రాజాం, శ్రీకాకుళం, టెక్కలిలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. పాలకొండలో జనసేన, ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో గెలిచిన వైసీపీ ఇప్పుడు ఒక్కస్థానంలో కూడా విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
AP: రాష్ట్రంలో ఎనిమిది మంది మాజీ సీఎంల వారసులు ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వారు. ఇందులో YS జగన్, నారా లోకేశ్, బాలకృష్ణ, పురందీశ్వరి(BJP), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి(TDP), నాదెండ్ల మనోహర్(జనసేన) విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, నేదురుమల్లి రామ్కుమార్(వెంకటగిరి, వైసీపీ) ఓటమి పాలయ్యారు. కాగా లోకేశ్, కోట్ల తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లనున్నారు.
AP: ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. చీరాలలో ఎంఎం కొండయ్య యాదవ్, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి విజయ దుందుభి మోగించారు.
AP: ఏపీ ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘మెగా డీఎస్సీ ఇప్పించే బాధ్యత నాది. సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే బుద్ధి నాకు లేదు. 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మా పాలనలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. వ్యవస్థల్లో రాజకీయ జోక్యం ఉండదు’ అని పవన్ స్పష్టం చేశారు.
AP: తన జీవితంలో ఇప్పటివరకు విజయం అంటే తెలీదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘సినిమాల్లో ఉన్నప్పుడు ‘‘తొలిప్రేమ’’తో విజయం చూశా అంతే. ఆ తర్వాత నేను విజయం సాధించానని గానీ డబ్బులు వచ్చాయని గానీ ఎవరూ చెప్పలేదు. నా జీవితమంతా దెబ్బలు తింటూ, మాటలు పడుతూ గడిపేశా. ఈరోజు నాకు 21కి 21 స్థానాల్లో విజయం అందించారు’ అని కార్యకర్తల సమావేశంలో పవన్ తెలిపారు.
కేరళలో 20 స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు 9 స్థానాలు గెలిచింది. మరో 5 చోట్ల ముందంజలో ఉంది. సీపీఎం, బీజేపీ, RSP ఒక్కో స్థానంలో గెలిచి, ఒక్కో స్థానంలో లీడింగ్లో ఉన్నాయి. IUML పార్టీ రెండు చోట్ల, KEC ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
INC గెలిచిన స్థానాలు: ఎర్నాకులం, ఇడుక్కి, మావెలిక్కర, తిరువనంతపురం, కోజికోడ్, వయనాడ్, వదకర, చాలకుడి, అలప్పుజ
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేశ్.. ఈసారి అదే స్థానం నుంచి 91వేల ఓట్లకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
Sorry, no posts matched your criteria.