India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందన్నారు. దేశానికి మా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని వివరించారు. రేపు కూటమి నేతల సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది PM మోదీ ఓటమి. మోదీ పేరు మీద ఓట్లు అడిగిన వారిదే ఈ పరాజయం. ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలిచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ పుంజుకుంది. ఇండియా కూటమి నేతలు ఏకతాటిపై నడిచి ఐకమత్యంతో ఫలితాలు సాధించాం’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఎనిమిదోసారి బంపర్ విక్టరీ సాధించారు. వైసీపీ అభ్యర్థి భరత్పై 48,184 ఓట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. చంద్రబాబు 1989 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి 32,795 ఓట్ల మెజార్టీ రాగా 1,09,885 ఓట్లు నమోదయ్యాయి. వినుకొండలో జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలవగా 29,683 మెజార్టీ దక్కింది. గురజాలలో యరపతినేని శ్రీనివాస్ 29,100 మెజార్టీతో నెగ్గారు. ఆయనకు 1,02,396 ఓట్లు పడ్డాయి.
AP: ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఆయన 34,100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీ నగర్ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్పై దాదాపు 7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు 10,10,972 ఓట్లు రాగా, సోనాల్కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
ఎన్నికల ఫలితాలను చూసి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్లేటు మార్చారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అప్పటివరకూ విమర్శలు చేసిన ఆర్జీవీ ఇలా మారిపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
AP: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డిపై 16 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాగా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఆయన గెలుపు రుచి చూశారు.
AP: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.
Sorry, no posts matched your criteria.