India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తన చివరి మ్యాచ్ వరకు భారత జట్టుకు అండగా ఉన్నారు. బాల్తోనే కాకుండా అవసరమైనప్పుడు బ్యాట్తోనూ రాణించి నిజమైన ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. బ్యాటర్లు విఫలమైనప్పుడు ‘ఇంకా అశ్విన్ ఉన్నాడులే’ అన్న అభిమానుల ధైర్యం అతడు. మన్కడింగ్, బౌలింగ్ వేస్తూ ఆగిపోవడం వంటి ట్రిక్స్తో ప్రత్యర్థి బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడం అశ్విన్కే చెల్లింది.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.
బాబా సాహెబ్ను కాంగ్రెస్ అవమానించిన చీకటి చరిత్రను HM అమిత్షా బయటపెట్టారని PM మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన అన్నీ నిజాలే చెప్పారన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచేసేందుకు కాంగ్రెస్ ప్రతి ట్రిక్కును వాడిందని Xలో విమర్శించారు. ‘ఏళ్లతరబడి అంబేడ్కర్ను మీరు అవమానించిన తీరు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పులను కాంగ్రెస్, దాని కుళ్లిన ఎకోసిస్టమ్ దాచాలనుకుంటే అది పెద్ద మిస్టేకే అవుతుంది’ అని అన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి, అదానీ బంధం బయటపడాలని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అదానీకి రెడ్ కార్పెట్ ఎందుకు వేశారని, ఆయన కంపెనీలకు భూములు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. అదానీ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇవాళ ఛలో రాజ్భవన్ ర్యాలీలో అదానీ మీద కాకుండా సీఎం BRS, కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు చేశారన్నారు.
డిసెంబర్ 21న వింత అనుభూతి పొందనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి, 8గంటలే సూర్యకాంతి ఉంటుందట. ఇలా సూర్యుడికి భూమి దూరంగా జరిగితే శీతాకాలపు అయనాంతం( Winter Solstice) అని, దగ్గరగా జరిగితే వేసవికాలం అయనాంతం(పగలు ఎక్కువ) అని అంటారు. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
TG: అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా BJPకి BRS పార్టీ లొంగిపోయిందని <<14912973>>CM రేవంత్ రెడ్డి<<>> ఆరోపించారు. BRS ప్రజల వైపా? అదానీ-ప్రధాని వైపా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ-KCR వేరు కాదని, ఇద్దరూ నాణేనికి బొమ్మ, బొరుసు అని విమర్శించారు. BRS పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై JPC విచారణకు డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. దీనిపై BRS కోరితే అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తామని సీఎం స్పష్టం చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని తదుపరి సాంగ్ ప్రోమోను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఫుల్ సాంగ్ను డిసెంబర్ 21న విడుదల చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రెండ్ సృష్టిస్తుండగా, ఈ హైఓల్టేజ్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
TG: మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా 1000 కొత్త బస్సులు కొంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40 నుంచి 100శాతానికి పెరిగిందన్నారు. కొత్త బస్సులను డ్వాక్రా సంఘాల ద్వారా కొంటామన్నారు. అవసరమైన చోట కొత్త డిపోలు నిర్మిస్తామన్నారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లకు బస్సులను పెంచుతామని MLAల ప్రశ్నలకు అసెంబ్లీలో బదులిచ్చారు.
TG: అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మనదేశ గౌరవానికి భంగం కలిగించడమే. అదానీపై విచారణ జరగాలి. జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేపట్టాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.