India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒడిశాలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నవీన్ పట్నాయక్ పాలనతో విసిగిపోయారో లేదా కొత్త ప్రభుత్వం కోరుకున్నారో, కాషాయ పార్టీకే ఓటర్లు మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ 79 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్లో ఉంది. మరోవైపు పట్నాయక్ పార్టీ BJD 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన లీడింగ్ ఉండటంతో BJP గెలుపు ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
TG: పార్లమెంట్ ఎన్నికల్లో BRS బోర్లా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేడర్లో ఉత్సాహం నింపుదామనుకున్న KCR వ్యూహం పనిచేయలేదు. స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఓట్లు రాలలేదు. దీనికితోడు మేడిగడ్డ కుంగడం, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వంటివి BRSకు మైనస్గా మారాయి. లోక్సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపడంతో BRS పూర్తిగా వెనకబడింది.
AP: ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరూ తిరిగి మళ్లీ గెలిచారు. గుమ్మనూరి జయరామ్ (గుంతకల్లు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), వసంత కృష్ణప్రసాద్ (మైలవరం), కొలుసు పార్థసారథి (నూజివీడు) టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
పశ్చిమబెంగాల్ లోక్సభ ఎన్నికల్లో అంచనాలు తారుమారవుతున్నాయి. మోదీ ప్రభంజనంలో బీజేపీ ఈసారి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నా ఓటర్లు టీఎంసీకే పట్టం కట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 42 స్థానాల్లో TMC 29, బీజేపీ 12, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడింగ్లో ఉన్నాయి. దీంతో మమతా జోరు ముందు మోదీ మంత్ర ప్రజల్లోకి వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
TG: హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. వచ్చే గంట, రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి, ఐఎస్ సదన్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఘన విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ఆయన సమీప అభ్యర్థి అజయ్ రాయ్(కాంగ్రెస్)పై 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు పడ్డాయి. ఆయన వారణాసిలో గెలవడం ఇది వరుసగా మూడోసారి.
AP: విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలను భారీ మెజార్టీలతో కూటమి కైవసం చేసుకుంది. విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమకు మొత్తం 1,27,365 ఓట్లు పోలవగా 67,599 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈస్ట్లో గద్దె రామ్మోహన్కి 1,18,841 ఓట్లు పడగా 49,640 ఓట్ల మెజార్టీ దక్కింది. బెజవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి 46,729 ఓట్ల మెజార్టీ రాగా 104717 ఓట్లు పోలయ్యాయి.
ఒప్పందం మేరకు ఎన్డీయేతోనే కొనసాగుతామని జేడీయూ స్పష్టం చేసింది. ‘విపక్షాలు నితీశ్ను తక్కువ అంచనా వేశాయి. మేం ఎన్డీయేతోనే ఉంటాం’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ ట్వీట్ చేశారు. ‘నితీశ్కు సంకీర్ణ ధర్మం తెలుసు. అపోజిషన్ ఆయన్ను తక్కువ అంచనా వేసింది’ అని మరోనేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ‘మా మద్దతు ఎన్డీయేకే. కేంద్రంలో మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని బిహార్ మినిస్టర్ మదన్ సాహ్ని అన్నారు.
ఇన్నాళ్లూ BRS ప్రధాన ప్రత్యర్థిగా రాజకీయాలు చేసిన TG కాంగ్రెస్కు ఇప్పుడు BJP రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత BRS పనైపోయిందని, ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమకే ఈ MP ఎన్నికల్లోనూ ప్రజలు పట్టంగడతారని ఆ పార్టీ భావించింది. కానీ.. BJP పుంజుకొని 4 MP సీట్ల(2019లో) నుంచి 8 సీట్లు సాధించింది. మరి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ BJPని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఏపీలో ఎన్డీయే కూటమి భారీ గెలుపు దిశగా సాగుతోంది. ఒక్క టీడీపీనే 100కు పైగా సీట్లు సాధించింది. 104 సీట్లలో సైకిల్ పార్టీ గెలవగా, 33 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు జనసేన 19, బీజేపీ 7 స్థానాల్లో గెలిచాయి. మరోవైపు వైసీపీ 3 సీట్లలో గెలిచి, 6 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
Sorry, no posts matched your criteria.