India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45,962 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు
ఏపీలో రాజకీయాలు తారుమారవడంతో సినీ ఇండస్ట్రీకి లాభం చేకూరనుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టికెట్ ధరల పెంపు, బెన్ఫిట్ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ పర్మిషన్స్, షూటింగ్స్కు కొత్త ప్రభుత్వం అనుమతులిస్తుందని, సినీ ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటుందంటున్నారు. TDP సపోర్టర్, నిర్మాత అశ్వినీ దత్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెబుతున్నారు. కాగా ‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
AP: ఎన్నికల పోలింగ్ సమయంలో అల్లర్లతో దేశవ్యాప్తంగా సంచలనమైన పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ గెలుపొందింది. అక్కడ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 32,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 25 ఏళ్లుగా మాచర్లను ఏలుతున్న పిన్నెల్లి కోటను జూలకంటి బద్దలుకొట్టినట్లయింది.
తెలంగాణను పదేళ్లు పాలించిన BRS ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ అయ్యేలా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 9 MP సీట్లు వచ్చాయి. ఈ సారి ఒక్క సీటు వచ్చేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల రూపంలో మరో ఘోర పరాభవం ఎదురయ్యేలా ఉంది. కార్యకర్తలు ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానంలోనూ BJP ఆధిక్యంలో కొనసాగుతుండటంతో BRS శ్రేణుల్లో నైరాశ్యం మొదలైంది.
మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానం గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ 8.17లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే, ఆయన తప్ప ఏ ఒక్కరికీ లక్ష ఓట్లు పడలేదు. ఏ అభ్యర్థి తమకు నచ్చకపోవడంతో ‘నోటా’కు ఏకంగా 1.81లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో ఇండోర్లో బీజేపీVSనోటాగా కౌంటింగ్ జరుగుతోంది. దేశంలో ఒకే చోట నోటాకు లక్ష కంటే ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి.
AP: నెల్లూరు జిల్లాలో సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాల్లో ఆ పార్టీనే గెలిచింది. కానీ ఇప్పుడు టీడీపీ అన్ని స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఫలితాల చివరి వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే నెల్లూరు జిల్లాలో టీడీపీ చరిత్ర సృష్టించనుంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ <<13375442>>పద్మనాభం<<>> పేరును మార్చే నూతన నామకరణ మహోత్సవానికి కాపు యువత సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీలోని కిర్లంపూడిలో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆహ్వాన పత్రికను నటుడు బ్రహ్మాజీ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వాలని కోరారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్పై 2,05,183 ఓట్ల తేడాతో గెలుపొందారు. కడియం కావ్య ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు.
AP: రాజకీయ హేమాహేమీలు గెలిచిన నంద్యాల లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఆమె 42,459 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు 3,00,982 ఓట్లు పోలయ్యాయి. ఆమె విజయం సాధిస్తే నంద్యాలలో నెగ్గిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా ఇక్కడ గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు.
జమ్మూకశ్మీర్లో ఇద్దరు మాజీ సీఎంలు ఓటమి పాలయ్యారు. అనంత్నాగ్-రాజౌరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సమీప JKNC పార్టీ అభ్యర్థి మియాన్ అహ్మద్ చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు బారముల్లా నియోజకవర్గంలో JKNC ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Sorry, no posts matched your criteria.