India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు లాంఛనమవడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో జరిగే వేడుకలకు కుటుంబసభ్యులంతా హాజరవుతారని సినీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందే తమ్ముడు పవన్కి చిరు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటు పిఠాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి నాగబాబు కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తున్నారు.
నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్రెడ్డి రికార్డు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా చివరి దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా… ప్రస్తుతం 5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు.
యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంబో సత్ఫలితాలు సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజ్పుత్లు, మైనారిటీలు, యాదవ్ వర్గాల మద్దతు, రైతులు, పేపర్ లీక్ వల్ల నష్టపోయిన లక్షలాది యువత మద్దతును ఇండియా కూటమికి కూడగట్టడంలో రాహుల్ – అఖిలేష్ ద్వయం సక్సెస్ అయింది. ఇవి ఓట్లుగా మారడంతో UPలో ఇండియా కూటమి 43, ఎన్డీయే 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
AP: ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్కు భారీగా మెజారిటీ తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 రౌండ్లు పూర్తి కాగా 37 వేలకుపైగా మెజారిటీతో ఆయన కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో జగన్కు 90 వేలకుపైగా మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో జనసేన బోణీ కొట్టింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అటు భీమవరంలోనూ జనసేన జెండా ఎగిరింది.
తమిళనాడులో చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై ఓటమి దిశగా సాగుతున్నారు. ఆమెపై డీఎంకే అభ్యర్థి 32,887 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కోయంబత్తూరులో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై 20,479 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అక్కడ డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ లీడింగ్లో కొనసాగుతున్నారు.
AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకం కానుంది.
ఓడినప్పుడే కాంగ్రెస్కు ఈవీఎంలపై అభ్యంతరాలు వస్తాయని బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ జోషీ విమర్శించారు. ‘కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు ఈవీఎంలపై అనుమానాలు రావు. అప్పుడు సైలెంట్గా ఉంటుంది. లోక్సభలో మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుంది’ అని ఆయన అన్నారు. కాగా రాజస్థాన్లో 25 స్థానాల్లో పది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈస్ట్ వర్సెస్ వెస్ట్ అన్నట్లుగా సాగుతున్నాయి. ఈస్ట్ తెలంగాణలోని మహబూబాబాబ్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండతో పాటు వెస్ట్లో జహీరాబాద్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో ఇప్పటికే గెలిచింది. మరోవైపు మహబూబ్నగర్, చేవెళ్ల, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో BJP ముందంజలో ఉంది. HYD స్థానంలో MIM ఆధిక్యంలో ఉంది.
Sorry, no posts matched your criteria.