India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత చెస్ ప్లేయర్ గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఫైనల్లో తన ప్రత్యర్థితో ఆడిన మ్యాచులో వినియోగించిన చెస్ సెట్ను ఎవరు తయారు చేశారో తెలుసా? అమృత్సర్కు చెందిన 34ఏళ్ల అనుభవం కలిగిన మాస్టర్ కార్వర్ బల్జీత్ సింగ్. ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం క్లిష్టమైన చెస్ పీసెస్ను చెక్కగలిగే కళాకారులు ప్రపంచంలో ఇద్దరు మాత్రమే ఉండగా.. అందులో సింగ్ ఒకరు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్నకు ఎదురు దెబ్బతగిలింది. పోర్న్స్టార్ స్టార్మీ డేనియల్స్కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యూయార్క్ జడ్జి తిరస్కరించారు. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ కేసు ప్రభావం చూపుతుందన్న ట్రంప్ లీగల్ టీం వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఖరారు కాలేదు.
విషయమేదైనా వాటిలో అత్యుత్తమమైన వాటిని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో సహాయపడుతోంది. తాజాగా పర్ఫెక్ట్ అమ్మాయి శరీర రూపం ఎలా ఉండాలనే దానిపై AI కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని సమాధానమిచ్చింది. బ్రెజిలియన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ రోసాలిన్ Perfect Female Bodyని కలిగి ఉందని తెలిపింది. హెల్త్, స్ట్రెంత్తో పాటు ఆమె ఫిజిక్, బాడీ నిష్పత్తులను అంచనా వేసింది.
TG: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో హరీశ్ రావు విమర్శలు చేశారు. దీనిపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు బయటపెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పులపై చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
TG: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి (BNPL) స్కీమ్స్, క్రెడిట్ కార్డుల వాడకంపై యువత జాగ్రత్తగా ఉండాలని RBI Dy గవర్నర్ దేబబ్రత పాత్రా వార్నింగ్ ఇచ్చారు. వీటితో సత్వర వినియోగం పెరిగినా సేవింగ్స్ తగ్గుతున్నాయని పేర్కొన్నారు. మానిటరీ పాలసీకి ఇది కొత్త సవాళ్లు విసురుతోందన్నారు. ఈజీ క్రెడిట్తో గృహ స్థాయిలో అప్పులు పెరిగి, ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఆర్థిక అక్షరాస్యత అవసరమని సూచించారు.
బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ స్టార్ బౌలర్ హేజిల్వుడ్ గాయపడ్డారు. కాలు పిక్కలు పట్టేయడంతో ఆయన ఫీల్డ్ను వదిలివెళ్లారు. అనంతరం హేజిల్వుడ్ను స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు CA తెలిపింది. కాగా నిన్న అద్భుతమైన బంతితో అతడు కోహ్లీ వికెట్ పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ను త్వరగా ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించేందుకు ఆసీస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం IND స్కోర్ 180/6గా ఉంది.
AP: ద.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, NLR, TRPT జిల్లాల్లో, ఈనెల 19న విశాఖ, VJA, 20న శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న 2 రోజుల్లో తమిళనాడు తీరం దిశగా రానుందని అంచనా వేసింది.
గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,584 (-84), సెన్సెక్స్ 81,487 (-269) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్స్, O&G షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. మీడియా, ఫార్మా, రియాల్టి సూచీలు పెరిగాయి. CIPLA, TATA MOTORS, ADANI PORTS, HCLTECH, TECH M టాప్ గెయినర్స్. SRIRAM FIN, GRASIM, RIL, AIRTEL టాప్ లూజర్స్.
కేంద్రం ఇవాళ పార్లమెంట్లో జమిలి బిల్లును ప్రవేశపెట్టనుంది. దీనిపై తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే APలో చంద్రబాబు నేతృత్వంలోని NDA పూర్తిగా మద్దతిస్తోంది. TGలో అధికార కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలైన YCP, BRS కూడా జమిలికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎన్నికలు త్వరగా వస్తే మరోసారి ప్రజల్లో అదృష్టం పరీక్షించుకోవచ్చనేది ఆ పార్టీల భావనగా నిపుణులు విశ్లేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.