News September 30, 2024

GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.

News September 30, 2024

గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!

image

ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్‌లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.

News September 30, 2024

‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

image

TG: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది.

News September 30, 2024

హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది: హైకోర్టు

image

TG: ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? అని హైకోర్టు ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చామని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

News September 30, 2024

ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా కౌంట‌ర్‌

image

PM మోదీని గ‌ద్దెదించే వ‌ర‌కు తాను చావ‌బోనంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధాని పట్ల కాంగ్రెస్, ఆ పార్టీ నేతలకు ఉన్న ద్వేషం, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఖ‌ర్గే అన‌వ‌స‌రంగా మోదీని ఆయన వ్య‌క్తిగ‌త, ఆరోగ్య విష‌యాల్లోకి లాగార‌ని పేర్కొన్నారు. ఈ తరహా వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్‌లో ఖర్గే అందర్నీ మించిపోయారన్నారు.

News September 30, 2024

చరిత్రాత్మక విజయం వెనుక అన్నదమ్ములు!

image

అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికాను ఓడించి ఐర్లాండ్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, SAను ఐర్లాండ్ మట్టికరిపించడంలో ఇద్దరు అన్నదమ్ములు కీలక పాత్ర పోషించారు. వారే అడైర్ బ్రదర్స్ మార్క్ & రోస్‌. ఒకరు బంతి, మరొకరు బ్యాట్‌తో SA ప్లేయర్లకు చుక్కలు చూపించారు. తొలుత రోస్ అడైర్ సెంచరీతో చెలరేగితే, మార్క్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. IR అభిమానులు వీరిని అభినందిస్తున్నారు.

News September 30, 2024

మా ప్రాణాలు తీశాకే ‘హైడ్రా’ కూల్చివేతలకు వెళ్లాలి: బండి సంజయ్

image

TG: అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరదీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చాలనుకుంటే హైడ్రాను బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తమ ప్రాణాలు తీశాకే కూల్చివేతలకు వెళ్లాలన్నారు. ఈ అంశంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు.

News September 30, 2024

దేవర సునామీ.. 3 రోజుల్లో రూ.304 కోట్లు

image

జూ.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. మరో వారంలో రూ.500 కోట్ల మార్క్‌కు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మారథే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News September 30, 2024

శని, ఆదివారాలు ఎందుకు కూల్చుతున్నారు?: హైకోర్టు

image

TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. శని, ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది. పొలిటికల్ బాస్‌లను, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది. కాగా అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు.

News September 30, 2024

‘తండేల్’ సాంగ్ షూటింగ్‌లో చైతూ-సాయి పల్లవి

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ‘తండేల్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం సినిమాలోని శివపార్వతుల సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు షూటింగ్ ఫొటోలను పంచుకున్నారు. ఇందులో డాన్సర్లతో కలిసి చైతూ, సాయి పల్లవి స్టెప్పులేసే సన్నివేశాన్ని చూపించారు. ఇద్దరి కాంబో చూడముచ్చటగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.