India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది. SC నియోజకవర్గాలైన వరంగల్లో ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, నాగర్ కర్నూల్లో మల్లు రవి, పెద్దపల్లిలో వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. ఇక ST నియోజకవర్గాల విషయానికి వస్తే మహబూబాబాద్ స్థానంలో బలరామ్ నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క ఆదిలాబాద్లో మాత్రం BJP అభ్యర్థి నగేశ్(ST) ముందంజలో కొనసాగుతున్నారు.
టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్పై 55వేలకు పైగా మెజారిటీతో శ్రీనివాస్ విజయదుందుభి మోగించారు. అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 50వేలకు పైగా మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు.
తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్రలు చేస్తూ, సభలు పెడుతూ నిర్విరామంగా శ్రమించిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటమి దిశగా సాగుతున్నారు. కోయంబత్తూరు నుంచి ఆయన పోటీలో ఉండగా.. డీఎంకే నేత గణపతి రాజ్ కుమార్ లీడ్లో ఉన్నారు. అయితే, ఓ పోలింగ్ బూత్లో ఆయనకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. అన్నామలై ఉన్నత చదువులు చదివి, ఐపీఎస్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.
రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్లో 1.4 లక్షల ఓట్ల లీడ్లో ఉన్నారు. రాయ్బరేలీలోనూ ప్రత్యర్థుల కంటే ముందంజలో దూసుకెళ్తున్నారు. 2019తో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 52 సీట్లు మాత్రమే సాధించిన ఆ పార్టీ, ఈసారి 98+ స్థానాల్లో లీడింగ్లో ఉంది.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లోనూ ఆమె ఓటమి దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అభ్యర్థి సుమతి 6148 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎంపీగా గెలుస్తాననే ధీమాతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాగా 2019లో డీఎంకే అభ్యర్థి తమిజాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
AP: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాల్లో ఒక్క చోట మినహా మిగతా అన్ని స్థానాల్లో కూటమి దూసుకెళ్తోంది. తూ.గోలోని 19 స్థానాల్లో TDP ముందంజలో ఉంది. ప.గోలో 15 స్థానాలకు గాను 14 స్థానాల్లో TDP లీడింగ్లో ఉంది. పోలవరంలో YCP అభ్యర్థి రాజ్యలక్ష్మి కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది.
AP: కనిగిరిలో టీడీపీ-వైసీపీ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఓ రౌండ్లో టీడీపీకి.. మరో రౌండ్లో వైసీపీకి లీడ్ వస్తోంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ 590 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యర్రగొండపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఆధిక్యం మారుతూ వస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 441 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
AP: కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె 15 వేలకుపైగా ఓట్ల లీడింగ్లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇక ఆత్మకూరు, వెంకటగిరిలో తప్ప జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది.
‘విశాఖనే పరిపాలనా రాజధాని చేస్తాం.. పాలన ఇక్కడి నుంచే చేస్తా.. జూన్-9న రెండోసారి CMగా ప్రమాణస్వీకారం ఇక్కడే చేస్తా’ అని CM జగన్ చెప్పిన మాటలను విశాఖ ప్రజలు పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో 15 స్థానాలకు 11 స్థానాల్లో గెలిచిన YCP.. ఈసారి 2స్థానాల్లో(అరకు, పాడేరు)నే ఆధిక్యంలో ఉంది. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న YCP హామీని ప్రజలు విశ్వసించలేదని తాజా ఫలితాలు చెబుతున్నాయి.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతి రౌండ్ రౌండ్కు ఆధిక్యం చేతులు మారుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఆధిక్యంలోకి వచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. తొలి రెండు రౌండ్లు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంలోకి వచ్చి వెనుకంజ వేశారు.
Sorry, no posts matched your criteria.