India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ <<15102620>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
అధిక వెయిటేజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా గ్రీన్లోనే ముగిశాయి. Sensex 224 పాయింట్ల లాభంతో 76,724 వద్ద Nifty 37 PTS ఎగసి 23,213 వద్ద స్థిరపడ్డాయి. IT, రియల్టీ షేర్లు రాణించాయి. NTPC, TRENT, Power Grid, Kotak Bank, Maruti టాప్ గెయినర్స్. M&M, Axis Bank, Bajaj Finserv టాప్ లూజర్స్. Sensex 76,700 పరిధిలో, Nifty 23,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది.
ముడా స్కాం కేసులో CM సిద్ద రామయ్యపై మైసూరు లోకాయుక్త పోలీసులు విచారణ కొనసాగించవచ్చని కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో ఈ కేసు విచారణపై ఇచ్చిన మధ్యంతర స్టేను తాజాగా ఎత్తేసింది. Jan 27లోపు విచారణ నివేదికను సమర్పించాలని జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆదేశించారు. అంతకంటే ముందు ఈ కేసుకు సంబంధించి గత ఏడాది Dec 19 నుంచి సేకరించిన అన్ని ఫైల్స్ను గురువారంలోపు అందజేయాలని ఆదేశించారు.
AP: సంక్రాంతి వేళ మందుబాబులకు లిక్కర్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలు తగ్గించగా, మరిన్ని బ్రాండ్ల రేట్లను తగ్గించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మాన్షన్ హౌస్ క్వార్టర్పై రూ.30, అరిస్టోక్రాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ రూ.50, కింగ్ఫిషర్ బీర్ రూ.10, బ్యాగ్పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీపై రూ.80 తగ్గించాయి. కొత్త ధరలతోనే షాపులకు మద్యం సరఫరా చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్లో అత్యధిక మ్యాచ్లు(430) గెలిచిన ప్లేయర్గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్లు ఉన్నాయి.
తప్పుడు పత్రాలతో ఐఏఎస్కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీన్స్తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను చూశారా? COMMENT
2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ నుంచి మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. చుట్టూ పురాతన దేవాలయాలు, శిథిల భవనాల మీదుగా హీరో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ‘గత సంక్రాంతికి ఎగరడం ప్రారంభించా. మీ ప్రేమతో ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా’ అని తేజ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది రిలీజైన ‘హనుమాన్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.
Sorry, no posts matched your criteria.