India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థులు కందుకూరులో ఇంటూరి, ఒంగోలులో దామచర్ల, కొండపిలో స్వామి, నెల్లూరు సిటీలో నారాయణ, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు దర్శిలో బూచేపల్లి, సర్వేపల్లిలో కాకాణి లీడింగ్లో ఉన్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ నుంచి పి.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. తొలుత వెనుకంజలో ఉన్నా ఆ తర్వాత లీడ్లోకి వచ్చారు.
ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది. దాదాపు అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వైసీపీ మంత్రులు, సీనియర్లకు షాక్ ఇస్తున్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. పలువురు వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ 855 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత వెనుకంజలో ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత మరణంతో ఉప ఎన్నిక జరిగింది.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉండటంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్.. బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీపై 6223 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి వారణాసి ప్రజలు షాక్ ఇస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. 42 లోక్సభ స్థానాల్లో కాషాయ పార్టీ 21 స్థానాల్లో, TMC 18 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కౌంటింగ్ కొనసాగే కొద్ది ఈ స్థానాలపై మరింత క్లారిటీ రానుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా సర్వేలు ఈ రాష్ట్రంలో బీజేపీకే మెజారిటీ సీట్లు వస్తాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ సొంతగడ్డ మహబూబ్నగర్, ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి నియోజకవర్గాల్లో BJP ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబ్నగర్లో డీకే అరుణ, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థులపై పైచేయిలో కొనసాగుతున్నారు.
✒ జమ్మలమడుగు-మూలె సుధీర్ రెడ్డి(YCP)
✒ కడప-మాధవీరెడ్డి 3,919 ఓట్లు(TDP)
✒ ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(YCP)
✒ చంద్రగిరి- పులివర్తి నాని(TDP)
✒ అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్(TDP)
✒ నగరి- గాలి భాను ప్రకాశ్(TDP)
✒ పూతలపట్టు- మురళీ మోహన్(TDP)
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలోకి వచ్చారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలోకి వచ్చారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. BRS నుంచి పద్మారావుగౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.