India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ జమ్మలమడుగు-మూలె సుధీర్ రెడ్డి(YCP)
✒ కడప-మాధవీరెడ్డి 3,919 ఓట్లు(TDP)
✒ ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(YCP)
✒ చంద్రగిరి- పులివర్తి నాని(TDP)
✒ అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్(TDP)
✒ నగరి- గాలి భాను ప్రకాశ్(TDP)
✒ పూతలపట్టు- మురళీ మోహన్(TDP)
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలోకి వచ్చారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలోకి వచ్చారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. BRS నుంచి పద్మారావుగౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో నిలిచారు.
ఉత్తర్ ప్రదేశ్లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా వెనకబడింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం 37లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాల్లో దూసుకుపోతోంది. అమేథీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం వెనుకంజలో ఉన్నారు.
AP: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విశాఖ జిల్లాలో టీడీపీ దూసుకెళ్తోంది. విశాఖ తూర్పులో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు.. వైసీపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనుకంజలో ఉన్నారు.
➣సత్తెనపల్లిలో మంత్రి అంబటి వెనుకంజ ➣పెదకూరపాడులో TDP అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 1500 ఓట్ల ఆధిక్యం ➣తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ 7885 ఓట్ల ఆధిక్యం ➣బాపట్లలో TDP అభ్యర్థి నరేంద్ర వర్మ 1394 ఓట్ల ఆధిక్యం ➣మైలవరంలో TDP అభ్యర్థి వసంత 1034 ఓట్ల ఆధిక్యం ➣విజయవాడ వెస్ట్లో BJP అభ్యర్థి సుజనా చౌదరి 2వేల ఓట్ల ఆధిక్యం ➣పెడన, నందిగామ అసెంబ్లీ, గుంటూరు, బాపట్ల MP స్థానాల్లో TDP ఆధిక్యం
AP: అరకు ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి తనుజారాణి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో కూటమి అభ్యర్థి గీతకు 2,566 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి తనూజ రాణికి 3,823 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి 1,357 ఓట్లు ఆధిక్యంతో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అప్పలనరస 866 ఓట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు.
కమలానికి కంచుకోటలా భావించే ఉత్తరప్రదేశ్లో బీజేపీ వెనుకబడింది. అక్కడ 80 ఎంపీ స్థానాలుండగా 42 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం.
✒ రాజంపేట ఎంపీ- కిరణ్ కుమార్ రెడ్డి(BJP) 3,000 ఓట్ల లీడింగ్
✒ ఉరవకొండ ఎమ్మెల్యే – పయ్యావుల కేశవ్(TDP) లీడింగ్
✒ రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు(TDP) లీడింగ్
✒ కడప ఎమ్మెల్యే- మాధవీరెడ్డి(TDP) 2,158 ఓట్ల లీడింగ్
✒ శింగనమల- బండారు శ్రావణి(TDP) ఆధిక్యం
✒ నంద్యాల- ఫరూఖ్(TDP) లీడింగ్
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.