India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజరాత్లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో లీడింగ్లో దూసుకెళ్తున్నాయి. తమిళనాడులో డీఎంకే 14, కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, సేన 4, NCP SP 3, SS UBT 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి. అటు కర్ణాటకలో 8 చోట్ల బీజేపీ, 7 చోట్ల INC, 2 చోట్ల JDS, కేరళలో 16 స్థానాల్లో UDF, 4 స్థానాల్లో LDF ఆధిక్యంలో ఉన్నాయి.
TG: భువనగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో ఉన్నారు.
AP: కడప పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ(SC) అభ్యర్థి వరప్రసాద్ రావు లీడింగులో ఉన్నారు.
రాజస్థాన్లోని కోటా నుంచి పోటి చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందంజలో ఉన్నారు. బీజేపి నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రహ్లాద్ గుంజాల్పై ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
AP:చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావుపై బొత్స లీడింగ్లో ఉన్నారు. అటు గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బొత్స అప్పల నర్సయ్య బరిలో నిలిచారు.
హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ముందంజలో ఉన్నారు.
AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ లీడింగులో ఉన్నారు. స్థానికంగా సొంత పార్టీ నేతల నుంచే ఆమె అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. తన గెలుపుకు సొంత నేతలే సహకరించడం లేదని పోలింగ్ రోజున రోజానే స్వయంగా చెప్పారు. మైదుకూరు TDP అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడింగులో కొనసాగుతున్నారు. అక్కడ YCP MLA రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
AP: రాజమండ్రి లోక్సభ బీజేపీ అభ్యర్థి పురందీశ్వరి, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్లో ఉన్నారు.
TG: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య ముందంజలో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్ మొత్తం 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.