News September 30, 2024

పాకిస్థాన్ అలా చేసి ఉంటే..: రాజ్‌నాథ్ సింగ్

image

J&K ఎన్నికల ప్రచారంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ గాని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే IMFని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందని విమర్శించారు.

News September 30, 2024

దసరా ఉత్సవాల్లో పొరపాటు జరిగితే అధికారులదే బాధ్యత: మంత్రి

image

AP: ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులదే బాధ్యత అని మంత్రి రామనారాయణరెడ్డి హెచ్చరించారు. 13 ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. VVIP దర్శనాలకు ఉ.8-10, మ.2-4 గంటల వరకు, వృద్ధులు, దివ్యాంగులకు సా.4-5 గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు. OCT 9న అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు.

News September 30, 2024

బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది!

image

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్‌లు జంటగా నటించారు.

News September 30, 2024

ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.

News September 30, 2024

కాసేపట్లో ఫలితాలు విడుదల

image

TG: టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

News September 30, 2024

ఆర్థిక సంక్షోభం.. పాక్‌లో 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

image

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.

News September 30, 2024

సామాన్యులపై పిడుగు.. పెరగనున్న బియ్యం ధరలు

image

ఇప్పటికే నిత్యావసరాలు, ఆయిల్స్, పప్పుల ధరలు <<14214575>>పెరగడంతో<<>> ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ప్రస్తుతం సోనామసూరి, HMT, బీపీటీ తదితర సన్నబియ్యం రకాల ధర కిలో రూ.60-70 ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించడమూ ప్రభావం చూపనుంది.

News September 30, 2024

సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్

image

అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. టీ20 WC-2024 రన్నరప్ సౌతాఫ్రికాను ఐర్లాండ్ ఓడించింది. టీ20 చరిత్రలో SAపై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత ఐర్లాండ్ 195/6 స్కోర్ చేయగా, SA 185/9కి పరిమితమైంది. IRE జట్టులో రాస్ అడైర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది.

News September 30, 2024

రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.