News April 21, 2025

రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

image

ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్‌లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఎల్లుండి కూడా 12 మండలాల్లో తీవ్ర, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News April 21, 2025

ఏడాదికి 80లక్షల ఉద్యోగాలు సృష్టించాలి: అనంత్ నాగేశ్వరన్

image

2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.

News April 21, 2025

అమరావతిలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే

image

AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.

News April 21, 2025

IPL 2025: 400+ రన్స్ చేసిన సాయి సుదర్శన్

image

గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లోనూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.

News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

News April 21, 2025

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

AP: గ్రూప్‌-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News April 21, 2025

ఈ నెల 25న ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’

image

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 25 నుంచి NETFLIXలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

News April 21, 2025

‘డ్రగ్స్ తీసుకున్నా’.. పోలీసు విచారణలో టామ్ చాకో!

image

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మేజర్ యాక్టర్లు కూడా మాదకద్రవ్యాలు వాడతారని చెప్పినట్లు సమాచారం. పోలీసుల సోదాలతో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్పారని పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. డ్రగ్స్ కొనేందుకు ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసేవాడినని, అయితే వారెవరనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నాయి.

News April 21, 2025

మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్‌ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్‌కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్‌లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు.

News April 21, 2025

అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పిన రోహిత్

image

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్‌లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.