India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 ప్రపంచకప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సఫారీల ధాటికి 77 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ మెండిస్ 19(30), కమిందు మెండిస్ 11(15), మాథ్యూస్ 16(16) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. దీంతో ప్రోటీస్ జట్టు 16.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. సఫారీ బౌలర్ నార్ట్జే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.
తేది: జూన్ 4, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:50 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు
ఇష: రాత్రి 8.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 4, మంగళవారం
బ.త్రయోదశి: రాత్రి 10.01 గంటలకు
భరణి: రాత్రి 10:34 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.08:12 నుంచి 09:04 వరకు తిరిగి రాత్రి గం.10.59 నుంచి 11.43 వరకు
వర్జ్యం: ఉదయం గం.09:05 నుంచి 10:35 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* రేపే ఎన్నికల కౌంటింగ్.. సర్వత్రా ఉత్కంఠ
* నటి హేమ అరెస్ట్.. 14 రోజుల కస్టడీ
* ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఈనెల 7 వరకు పొడిగింపు
* తెలంగాణను తాకిన రుతుపవనాలు
* కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు: CBN
* వైసీపీ శ్రేణులు రేపు అప్రమత్తంగా వ్యవహరించాలి: జగన్
* YCPకి 123 స్థానాలు వస్తాయి: పరిపూర్ణానంద
* రూ.8 లక్షల కోట్లు దాటిన ఎస్బీఐ మార్కెట్ విలువ
* T20 WC-2024 విజేతకు ప్రైజ్మనీ ₹20.36కోట్లు
లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు మాత్రమే సింగిల్ డిజిట్ ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో ఉమ్మడి ఏపీలోని అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలిచారు. 1998లో బిహార్లోని రాజ్మహల్ స్థానం నుంచి BJP నేత సోమ్ మరండి 9 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. 1996లో బరోడా నుంచి కాంగ్రెస్ నేత గైక్వాడ్ సత్యజీత్ సిన్హా 17 ఓట్ల తేడాతో గెలుపొందారు.
భారత జట్టు 2007, 2011 WCలు గెలవడంతో ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఒకవేళ తాను టీమ్ఇండియా కోచ్ అయితే స్పెషలిస్ట్ బ్యాటర్లందరూ అవసరమైనప్పుడు కచ్చితంగా బౌలింగ్ చేయాలనే రూల్ను తీసుకొస్తానని చెప్పారు. ఆనాటి జట్టులో సచిన్, యువీ, రైనా బౌలింగ్ చేసేవారని, ఇప్పటి జట్టులో రోహిత్, విరాట్, సూర్య ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా టీమ్కు కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాకా 97.82 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇప్పటికీ కొందరు పోస్ట్ ద్వారా నోట్లను పంపుతున్నట్లు తెలిపింది. 2016లో పాత రూ.1,000, 500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను RBI తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
భారత జట్టు కోచ్గా తనకు T20WC చివరి టోర్నమెంట్ అని ద్రవిడ్ వెల్లడించారు. హెడ్ కోచ్ పదవికి మరోసారి దరఖాస్తు చేసే ఆలోచన తనకు లేదని ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. కోచ్గా ఉండటాన్ని తాను ఎంజాయ్ చేశానని, రాబోయే కాలంలో టీమ్ షెడ్యూల్స్ను దృష్టిలో ఉంచుకుని మరోసారి అప్లై చేయొద్దని డిసైడ్ అయినట్లు చెప్పారు. WCలో రోహిత్, జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని, కోహ్లీ కూడా ఓపెనర్గా రావొచ్చని చెప్పారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో TSPSC పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారి భుజంగరావు అంగీకరించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. దీనిపై రేపు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
Sorry, no posts matched your criteria.