India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.
✒ తిథి: శుక్ల చతుర్దశి ఉ.4.55 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.11.00 వరకు
✒ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 గంటల వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: రా.10.50-12.30 వరకు
✒ అమృత ఘడియలు: లేవు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
☛ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
☛ ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి TGకి ఉంది: సీఎం రేవంత్
☛ TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
☛ తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
☛ తిరుమల ఘటనపై CM, Dy.CM రాజకీయ డ్రామాలు ఆపేయాలి: జగన్
☛ దేశంలో ఇప్పటివరకు 17 hMPV కేసులు
☛ మార్చి 21 నుంచి ఐపీఎల్-2025
సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్షకు NTA దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపు (జనవరి 13) సా.5గంటల వరకూ <
TG: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా రెండో, నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న తొలి భేటీకి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. ఇకపై ఉద్యోగులెవరూ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదన్నారు.
‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.
NCP(SP) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.
AP: స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం 50% సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. లబ్ధిదారులు 3 టైర్ల మోటరైజ్డ్ వెహికల్స్ కలిగి ఉండాలి. సంక్షేమ శాఖ ఆఫీసుల్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2HP వాహనాలకు నెలకు 15 లీటర్ల వరకు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యమున్న వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు రాయితీ లభిస్తుంది. బిల్లులు సమర్పిస్తే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తారు.
ఉత్తరాఖండ్లోని పౌడీ గర్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహల్చోరి సమీపంలో ఒక బస్సు నియంత్రణ కోల్పోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.