India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా.. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

కొన్ని వస్తువులు కింద పడటం అశుభ సంకేతంగా భావిస్తారు. పాలు కింద పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. ఉప్పు ఒలికితే ఆర్థిక ఇబ్బందులు, నల్ల మిరియాలు కింద పడితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే, పూజా ఫలకం కింద పడితే పెద్ద సంక్షోభానికి దారి తీయవచ్చు. బియ్యం లేదా గోధుమలు కింద పడటం ఆహార కొరతను సూచిస్తుంది. కాబట్టి, ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని పెద్దలు చెబుతుంటారు.

రాష్ట్రంలో 91.7% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,52,113 భారం ఉంది. రైతు కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.9,403 మాత్రమే. దేశ సగటు ఆదాయం రూ.10,218 కంటే ఇది తక్కువ. సిచ్యుయేషన్ ఎసెస్మెంట్ సర్వే 2018-19 ఉటంకిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్నాథ్ఠాకూర్ ఈ విషయాలు వెల్లడించారు.

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 13 నుంచి 20 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను వధూవరులుగా అలంకరిస్తారు. 15న త్రికాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మహాన్యాసం, లింగోద్భవ కాలంలో అభిషేకాలు, కళ్యాణోత్సవం జరుగుతుంది. 16న సాయంత్రం రథోత్సవం ఉంటుంది.

కొంతమంది మహిళలకు పీరియడ్స్కి ముందు రొమ్ములు సున్నితంగా ఉండటం, నొప్పి, రొమ్ముల సైజు పెరగడం వంటివి జరుగుతాయి. పీరియడ్స్లో రొమ్ముల్లో వచ్చే ఈ మార్పులను ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ అంటారు. పీరియడ్స్లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడంతో ఇలా జరుగుతుందంటున్నారు. పీరియడ్స్లో ఇది సాధారణమే కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అసాధారణ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Sorry, no posts matched your criteria.