News June 3, 2024

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు

image

AP: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేయగా, దీనిపై రఘురాజును మండలి ఛైర్మన్ వివరణ కోరారు. ఆయన విచారణకు రాకపోవడంతో వేటు వేశారు.

News June 3, 2024

రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు సా.6 వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తల్లి సరోజినీ దేవి(98) నిన్న రాత్రి మరణించారు.

News June 3, 2024

క్రికెట్‌కు కేదార్ గుడ్‌బై

image

టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. టీమ్ ఇండియా తరఫున ఆయన 73 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడారు. ఐపీఎల్‌లో ఢిల్లీ, కొచ్చి, RCB, హైదరాబాద్‌, చెన్నైకి ప్రాతినిధ్యం వహించారు.

News June 3, 2024

BREAKING: సోషల్ మీడియాలో బెదిరింపులపై డీజీపీ వార్నింగ్

image

AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం కూడా నిషిద్ధమన్నారు. ‘అలాంటి వ్యక్తులపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి, PD యాక్ట్ ప్రయోగిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.

News June 3, 2024

‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

హీరో ప్రభాస్ ‘కల్కి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీ అయింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా జూన్ 7న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ముంబై వేదికగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. దీనిపై వైజయంతి మూవీస్ ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 3, 2024

గ్రౌండ్ సాఫ్ట్‌గా ఉంది.. ఫిట్‌నెస్‌పై జాగ్రత్త: ద్రవిడ్

image

న్యూయార్క్ గ్రౌండ్ సాఫ్ట్‌గా ఉన్నందున ప్లేయర్ల లోయర్ లెగ్, తొడ కండరాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. అందువల్ల భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదే మైదానంలో బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో ఎల్లుండి ఐర్లాండ్‌తో, 9న పాక్‌తో, 12న USతో ఇండియా ఇదే స్టేడియంలో తలపడనుంది.

News June 3, 2024

ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా ఎలాన్ మస్క్!

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్టులో ఆయన పారిశ్రామిక దిగ్గజాలైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్‌ని అధిగమించారు. మస్క్ ఆస్తుల విలువ 210.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్(201 బి.డాలర్లు), జెఫ్ బెజోస్(197.4 బి.డాలర్లు), ఫేస్‌బుక్ CEO జుకర్‌బర్గ్($163.9 B), ఓరాకిల్ కోఫౌండర్ లారీ ఎలిసన్($146.2 B) తర్వాతి 4స్థానాల్లో ఉన్నారు.

News June 3, 2024

ఏ దశలో ఎంత మంది ఓటేశారంటే?

image

లోక్‌సభ-2024 ఎన్నికల్లో ఫేజ్-1లో అత్యధిక మంది ఓటేసినట్లు ఈసీ తెలిపింది. మొదటి దశలో 12.27 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంది. ఫేజ్-2లో 7.47 కోట్లు, ఫేజ్-3: 9.19 కోట్లు, ఫేజ్-4: 11.04 కోట్లు, ఫేజ్-5: 8.72 కోట్లు, ఫేజ్-6: 9.22 కోట్లు, ఫేజ్-7లో 4.09 కోట్ల మంది ఓటు వేశారని వివరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేశారు.

News June 3, 2024

తెలంగాణను తాకిన రుతుపవనాలు.. భారీ వర్షాలు

image

TG: నైరుతి రుతుపవనాలు తెలంగాణ తీరాన్ని తాకాయి. నాగర్‌కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.

News June 3, 2024

గాజాపై ఆగని దాడులు.. 19 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఖాన్‌యూనిస్‌లోని సౌత్ సిటీలో వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులున్నారు. గాజాలో హమాస్ అధికారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఇజ్రాయెల్ మంత్రి గల్లాంట్ తెలిపారు. ఇటు కాల్పుల విరమణ చేపట్టి బందీలను విడుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు హమాస్ తెలిపింది.