News January 12, 2025

‘డాకు మహారాజ్’ వచ్చేది ఈ OTTలోనే!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. అయితే, 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News January 12, 2025

యువీ తర్వాత 6 సిక్సులు కొట్టగలిగేది అతడే: బంగర్

image

యువరాజ్ సింగ్ తరహాలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూ శాంసన్‌కు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం సంజూకు దక్కుతున్న సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. దీని కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూశాడు. సరైన సమయంలో చక్కటి అవకాశాలు దక్కాయి. ఓపెనర్ కాబట్టి అతడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. యువీ తర్వాత 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూకే ఉంది’ అని పేర్కొన్నారు.

News January 12, 2025

ఐఫోన్ తర్వాత యాపిల్ కొత్తగా ఏం తీసుకురాలేదు: జుకర్‌బర్గ్

image

టెక్ దిగ్గజం యాపిల్‌పై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విమర్శలు గుప్పించారు. ఆ సంస్థ ఆవిష్కరణ సామర్థ్యాన్ని కోల్పోయిందని తేల్చిచెప్పారు. ‘ఐఫోన్ అద్భుతమే. సగానికి పైగా ప్రపంచం ఆ ఫోన్లను వాడుతోంది. కానీ ఆ తర్వాత వేరే ఆవిష్కరణను యాపిల్ తీసుకురాలేకపోయింది. స్టీవ్ జాబ్స్ కనిపెట్టిన ఉత్పత్తిపైనే 20 ఏళ్లుగా ఆ కంపెనీ బతుకుతోంది. ప్రజల్ని పీల్చి పిప్పి చేసి లాభాలు దండుకుంటోంది’ అని పేర్కొన్నారు.

News January 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు ఎంపిక

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లు షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, పర్వేజ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, హసన్ షకీబ్, నహీద్ రాణా

News January 12, 2025

కుంభమేళా వెనుక కథ ఏంటంటే..

image

కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.

News January 12, 2025

కుక్క బర్త్ డే కోసం రూ.5లక్షలు ఖర్చు!

image

పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్‌కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్‌ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.

News January 12, 2025

మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి: సీఎం

image

TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.

News January 12, 2025

సీనియర్ ప్లేయర్లపై బీసీసీఐ కీలక నిర్ణయం?

image

టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పని ఒత్తిడి వల్ల వారికి ఆడడం కుదరకపోతే ముందుగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనుమతి తీసుకోవాలని సమాచారం. దీనిని అతిక్రమించినవారిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లనే జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News January 12, 2025

ఎన్నికలంటేనే భయం వేస్తోంది.. పోటీ చేయలేం: మాజీ సీఎం కిరణ్

image

AP: ఏ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగా తాను మారలేదని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. డబ్బు దోచుకునే వాళ్లలో కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటేనే భయమేస్తోందని, రానున్న రోజుల్లో పోటీ చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.

News January 12, 2025

క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించిన ఢిల్లీ సీఎం

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించారు. కల్కాజీ నుంచి పోటీ చేసేందుకు రూ.40లక్షలు కావాలంటూ లింకును షేర్ చేశారు. నిజాయితీగా పనిచేసేందుకు AAPకి సామాన్యులిచ్చే చిన్న చిన్న విరాళాలే సాయపడతాయని అన్నారు. ‘ఐదేళ్లు MLA, మంత్రి, ఇప్పుడు ఢిల్లీ CMగా ఉన్న నాకు మీరు వెన్నంటే నిలిచారు. మీ బ్లెసింగ్స్, సపోర్ట్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మీ విరాళాలే నాకు తోడ్పాటునిస్తాయి’ అన్నారు.