India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గతనెల 24న నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను <
ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి సానుకూలంగా రావడంతో నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ ఈ ఒక్కరోజే 500 పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ 23వేల మార్క్ చేరుతుందని అంచనా వేశారు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. కాగా గతనెల 24న ఆల్ టైమ్ హై నమోదు చేసిన నిఫ్టీ ఆ తర్వాత ఒడుదొడుకులను ఎదుర్కొని డీలా పడింది.
ఈసారి అధికారం తమదే అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేయడాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన భ్రమలో ఉన్నారని, మరికొన్ని గంటల్లో వాస్తవాలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయసు చిన్నదేనని.. ఆయన ఎదురుచూడటానికి 2029, 2034 ఎన్నికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈసారి బీజేపీ 340కిపైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పిప్లోడీ ప్రాంతంలో ట్రాక్టర్ తిరగబడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్కు చెందిన వీరు ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముర్ము, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
హష్ మనీ కేసులో తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ ప్రజలు నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఇందుకు బదులు తీర్చుకుంటానని తెలిపారు. గతంలో ఓ అడల్ట్ స్టార్కు చేసిన చెల్లింపులను 2016 ఎన్నికలప్పుడు సమర్పించిన వివరాల్లో ట్రంప్ కప్పిపుచ్చినట్లు కోర్టు విచారణలో తేలింది.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పుట్టినరోజు ఈరోజే (జూన్ 3) అయినా ఆయన ఒక రోజు ముందే సెలబ్రేట్ చేసుకుంటారు. దీని వెనుక ఓ ఆసక్తికర స్టోరీ ఉంది. ఇళయరాజాకు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అంటే ఎంతో అభిమానం. కరుణానిధి పుట్టినరోజు కూడా జూన్ 3నే కావడంతో ఆయన మీద గౌరవంతో రాజా తన పుట్టినరోజును ఒక రోజు ముందే జరుపుకోవడం మొదలుపెట్టారట. కాగా కరుణానిధి ఇళయరాజాను గతంలో ‘ఇసయ్జ్ఞాని’ అనే బిరుదుతో గౌరవించారు.
మే నెలలో దేశవ్యాప్తంగా 56 మందికిపైగా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 24 మంది కూడా ఈ కారణంగానే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులతో 605 మంది మృతిచెందినట్లు వెల్లడించింది. వడదెబ్బకు సంబంధించి అత్యధికంగా మహారాష్ట్రలో 5,204 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (4,357), ఏపీ (2,183) ఉన్నట్లు పేర్కొంది.
1924: తమిళనాడు సీఎం కరుణానిధి జననం
1930: మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ జననం
1943: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జననం
1952: రచయిత బండి నారాయణస్వామి జననం
1965: నటి రాధ జననం
1972: BRS నేత హరీశ్ రావు జననం
2016: బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ మరణం
>> ప్రపంచ సైకిల్ దినోత్సవం
టీ20 ప్రపంచకప్లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ప్రత్యర్థిని 136 పరుగులకు కట్టడి చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు చెమటోడ్చారు. సునాయాసంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్ 19వ ఓవర్ వరకు కొనసాగింది. బ్రాండన్ కింగ్ 34(29), ఛేస్ 42*(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.