News June 2, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు

image

భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, అమిత్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ లియు చువాంగ్‌పై అమిత్ విజయం సాధించారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో మరైన్ కమరాను 5-0 తేడాతో జైస్మిన్ చిత్తు చేశారు. దీంతో వీరిద్దరూ పారిస్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. కాగా ఈ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి.

News June 2, 2024

చిన్న ఘటనపై రాద్ధాంతం చేశారు: అంజలి

image

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తనను తోసేసిన ఘటనపై హీరోయిన్ అంజలి మరోసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు మాత్రమే తెలుసు. కొద్దిగా జరగాలంటూ బాలయ్య నెట్టారు. నేను వెంటనే నవ్వేశా. చాలా చిన్న సంఘటనపై సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేశారు’ అని పేర్కొన్నారు. బాలకృష్ణకు, తనకు పరస్పర గౌరవం ఉందని ఇటీవల <<13346819>>ట్వీట్<<>> చేసిన విషయం తెలిసిందే.

News June 2, 2024

ఎగ్జిట్ పోల్స్: ఒడిశాలో BJP, బీజేడీ మధ్య టఫ్ ఫైట్

image

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో BJP, బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. ఇరు పార్టీలకు 62-80 సీట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ 5-8 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడింది. అత్యధికంగా BJDకి 42%, బీజేపీకి 41%, కాంగ్రెస్‌కు 12%, ఇతరులకు 4-5 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.

News June 2, 2024

చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

AP: మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని CBN నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

News June 2, 2024

అది రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా: హరీశ్ రావు

image

TG: తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని <<13362849>>మంత్రి <<>>కోమటిరెడ్డికి BRS ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ చేశారు. తాను కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లానని ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి వెళ్లాననే వివరాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. మంత్రి రుజువులతో రావాలని డిమాండ్ చేశారు.

News June 2, 2024

బిడ్డ మృతి.. ఫ్లెక్సీతో తల్లిదండ్రుల నిరసన

image

AP:వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని పేరెంట్స్ టెక్కలిలో ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. SKLM(D) చిన్ననారాయణపురానికి చెందిన వినీత్(12)ను పాము కాటేసింది. ముల్లు గుచ్చుకుందని డాక్టర్లు 2 గంటలు వదిలేశారని, పరిస్థితి విషమించాక SKLM తీసుకెళ్తుండగా బాబు చనిపోయాడని పేరెంట్స్ చెప్పారు. ‘పాముకాటుకు, ముల్లుకు తేడా తెలియని డాక్టర్లకు వందనాలు. వారిపై ఏం చర్య తీసుకుంటారు’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News June 2, 2024

మాధవీ లత గెలిచే అవకాశం: India Today

image

దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని India Today Axis My India తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీ లత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. చివరికి మాధవీ లతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే.

News June 2, 2024

రాబోయే ప్రభుత్వంతో ఏపీ పరిస్థితి మారాలి: ఉండవల్లి

image

AP: రాబోయే ప్రభుత్వంతో అయినా ఏపీలో పరిస్థితి మారాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. తెలంగాణలో అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని, ఏపీ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సమస్యలు పరిష్కరించాల్సి ఉందని రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత పదేళ్లుగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించారు.

News June 2, 2024

కూటమికి తిరుగులేని విజయం: చంద్రబాబు

image

AP ఎన్నికల్లో NDA కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని TDP అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి అభ్యర్థులతో సమీక్షించిన ఆయన.. ‘3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడేందుకు, పోస్టల్ ఓట్లపై కొర్రీలకు YCP ప్లాన్ చేస్తోంది. డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలి’అని సూచించారు.

News June 2, 2024

దంపుడు బియ్యంతో ఆరోగ్యం భేష్

image

పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధకులు ఎప్పటినుంచో చెప్తున్న మాట. తెల్లబియ్యం వాడకాన్ని తగ్గించి వీటిని తీసుకుంటే మధుమేహం, రక్తపోటు ముప్పుని తగ్గిస్తాయి. నియాసిన్, విటమిన్ బి3, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ నివారిణిగా పనిచేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పిండి పదార్థం తక్కువగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు.