News October 31, 2025

సీపీఎం నేత దారుణ హత్య

image

TG: ఖమ్మం జిల్లా CPM రైతు సంఘం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉదయం చింతకాని(M) పాతర్లపాడులో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈయన ఉమ్మడి APలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రామారావు హత్య పట్ల Dy.CM భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.

News October 31, 2025

PHOTO: సీఎం రేవంత్‌తో సల్మాన్ ఖాన్

image

TG CM రేవంత్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్‌తో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కల్పిస్తానని సల్మాన్ చెప్పినట్లు సమాచారం.

News October 31, 2025

ఐపీవోకు Groww

image

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.

News October 31, 2025

కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.

News October 31, 2025

TG SET దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News October 31, 2025

అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు!

image

AP: అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. అమరావతిలో 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ట్రైన్ల హాల్టింగ్ ఉంటుంది. భవిష్యత్తులో 120 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని అభివృద్ధి చేస్తారు. దీనికోసం 300 ఎకరాల అవసరముంది. అటు గన్నవరంలో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్స్ ఉండగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా 10 లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాలు కావాలి.

News October 31, 2025

మావోయిస్టు డంపుల్లో 400 కిలోల గోల్డ్?

image

మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. ఆ ఫండ్‌ను కొవిడ్ టైమ్‌లో బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్ల కంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 KGల గోల్డ్ ఉండొచ్చని అనుమానిస్తోంది.

News October 31, 2025

సబ్జా గింజలతో కురులకు బలం

image

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News October 31, 2025

పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

image

బ్రూసిల్లా అబార్టస్‌ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్‌. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 31, 2025

అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది

image

సెమీస్‌లో అద్భుతమైన ఆటతో భారత్‌ను WWC ఫైనల్ చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్‌లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.