India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: జూన్ 2, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు అసర్: సాయంత్రం 4:49 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు ఇష: రాత్రి 8.08 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 2, ఆదివారం బ.ఏకాదశి: అర్ధరాత్రి 2.41 గంటలకు రేవతి: అర్ధరాత్రి 01:40 గంటల వరకు దుర్ముహూర్తం: సాయంత్రం 04:49 నుంచి 05:41 వరకు వర్జ్యం: మధ్యాహ్నం 02:28 నుంచి మధ్యాహ్నం 03:57 వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
☞ దేశంలో NDAదే అధికారం: ఎగ్జిట్ పోల్స్
☞ ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ: సర్వేలు
☞ TGలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ: సర్వేలు
☞ దశాబ్ధి ఉత్సవాలకు హాజరుకాను: KCR
☞ ఫోన్ ట్యాపింగ్ కేసు CBIకి ఇవ్వాలి: బండి
☞ ఎగ్జిట్ పోల్స్కు మించి ఫలితాలు: సజ్జల
☞ చంద్రబాబు సీఎం కావడం ఖాయం: అయ్యన్నపాత్రుడు
☞ తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
☞ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు DK రిటైర్మెంట్
టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ఇండియా 8 వికెట్లు పడగొట్టి బంగ్లాను 122 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటర్లలో పంత్ 53(32), SKY 31(18), హార్దిక్ 40*(23) రాణించారు. అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టగా బూమ్రా, అక్షర్, హార్దిక్, సిరాజ్ చెరొక వికెట్ తీశారు.
మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మే నెలలో దిగుమతులు క్షీణించినా దేశీయంగా లావాదేవీలు 15.3 శాతం పెరగడం కలిసొచ్చాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.32409 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,781 కోట్లు కాగా సెస్సుల రూపంలో రూ.12,284 కోట్లు వచ్చింది.
మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్పై గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శరద్ పవార్ వర్గంలోని NCP నుంచి సుప్రియ పోటీ చేయగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని NCP నుంచి సునేత్రా బరిలోకి దిగారు. గతంలో శరద్ పవార్ చేతుల్లో ఉన్న NCPని అజిత్ పవార్ హస్తగతం చేసుకోగా.. ఎన్నికల సంఘం కూడా అజిత్కే మద్దతిచ్చింది. దీంతో సుప్రియా, సునేత్రా మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు మీడియా సంస్థ బిగ్ టీవీ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో NDA కూటమి 106-119 చోట్ల విజయం సాధిస్తుందని, వైసీపీ 56-69 సీట్లకే పరిమితం అవుతుందని ప్రకటించింది. ఇక లోక్సభ సీట్లలో కూటమి 17-18, YCP 7-8 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడించింది.
జమ్ము-కశ్మీర్(5సీట్లు): ఎన్డీఏ-2, నేషనల్ కాన్ఫరెన్స్-3, ఇండియా-0
లడక్(ఒక సీటు): ఇండియా కూటమి-1
దాద్రా నగర్ హవేలి&డామన్ డయ్యూ(2 సీట్లు): ఎన్డీఏ: 2, ఇండియా కూటమి: 0
అండమాన్ నికోబార్(1సీటు): ఎన్డీఏ- 1
లక్షద్వీప్(ఒక సీటు): కాంగ్రెస్-1
పుదుచ్చేరి(ఒక సీటు): ఇండియా కూటమి-1
ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు TDPకి, మరికొన్ని YCPకి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని సర్వేల్లో 2శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉండటంతో అధికారం ఎవరికి దక్కుతుందనే టెన్షన్ పార్టీలు, ప్రజల్లో నెలకొంది. విజయం ఎవరిదనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. రౌండ్ రౌండ్కు టెన్షన్ పెంచేలా కౌంటింగ్ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Sorry, no posts matched your criteria.