India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయ అరంగేట్రం చేసిన నటి కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని India Today Axis My India అంచనా వేసింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానంలో ఆమె కాషాయ జెండా ఎగరవేస్తారని తెలిపింది. మండి బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత విక్రమాదిత్య సింగ్కు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ స్థానానికి ఇవాళే పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
కేంద్రంలో NDA అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని CVoter సర్వే అంచనా వేసింది. BJP నేతృత్వంలోని NDAకి 353-383 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమికి 152-182 సీట్లు వస్తాయని అభిప్రాయపడింది. ఇతరులకు 04-12 సీట్లు వచ్చే అవకాశం ఉందంది.
తమిళనాడు, కేరళ నుంచి లోక్సభలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండబోతోందా? అంటే.. ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం ఇస్తున్నాయి. దాదాపు అన్ని మీడియా, సర్వే సంస్థలు తమిళనాడులో ఒకటి, కేరళలో 1-3 స్థానాలు ఆ పార్టీ గెలవొచ్చని అంచనా వేశాయి. ఇవే నిజమైతే దశాబ్దాలుగా BJPకి ప్రాతినిధ్యం లేని ఆ రాష్ట్రాల్లో పార్టీకి ఊపు వచ్చినట్లే. ఇటు APలోనూ 2 నుంచి 4 సీట్ల వరకు బీజేపీ గెలవొచ్చని సర్వే అంచనాలు పేర్కొంటున్నాయి.
ఉత్తరాఖండ్లో NDA కూటమి 5 పార్లమెంట్ సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది.
కోయంబత్తూరులో పోటీ చేసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓడిపోవచ్చని India Today-Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆయనపై ఇండియా కూటమి తరఫున నిల్చున్న DMK నేత గణపతి రాజ్కుమార్ విజయం సాధిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ అంచనాపై ఇండియా టుడేతో మాట్లాడిన అన్నామలై.. జూన్ 4న సర్ప్రైజ్ ఇస్తానన్నారు. కాగా TNలో బీజేపీ బలోపేతానికి అన్నామలై తీవ్రంగా కృషి చేస్తున్నారు.
భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన కోచ్లు, కెప్టెన్లు, సెలక్టర్లు, టీమ్మేట్స్, అభిమానులకు థాంక్స్ చెప్పారు. భారత జట్టుకు ఆడటం తన అదృష్టమన్నారు. తన జర్నీలో పేరెంట్స్ పిల్లర్లుగా ఉన్నారని చెప్పారు. భార్య దీపిక తన కెరీర్ను పణంగా పెట్టి తనకు సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.
ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయం కొట్టి మరోసారి అధికారం చేపడుతుందని CNX ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. NDA కూటమి 371-401 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. అటు ఇండియా కూటమి 109-139 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇతరులు 28-38 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
అస్సాంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఎన్డీయేకు 9-11 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 2-4 సీట్లు రావచ్చని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో NDA 9, అప్పటి యూపీఏ కూటమికి 3 సీట్లు రాగా AIUDF ఒక స్థానంలో గెలిచింది.
AP: వైసీపీలో కీలక నేతలు ఈ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉందని రైజ్ సర్వే సంస్థ అంచనా వేసింది. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, నగరిలో మంత్రి రోజా, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. అలాగే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కూడా ఓటమి తప్పదని రైజ్ సర్వే సంస్థ జోస్యం చెప్పింది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందని India Today Axis My India అంచనా వేసింది. 26 సీట్లున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 25-26, కాంగ్రెస్ 0-1 సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.