India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కూటమికి 22 ఎంపీ స్థానాలు వస్తాయని టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. వైసీపీకి 3 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. టీడీపీకి 3 ఎంపీ స్థానాలు తగ్గితే.. ఆయా చోట్ల వైసీపీ గెలవొచ్చని అభిప్రాయపడింది. అటు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఈ సంస్థ తన సర్వే ఫలితాన్ని వెల్లడించింది.
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుందని ఇండియా న్యూస్ D-DYNAMICS ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్డీయే కూటమికి 371, ఇండియా కూటమికి 125, ఇతరులకు 47 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
AP: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమకే అధికారం వస్తుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘జూన్ 4న దీనికి మించి ఫలితాలు వస్తాయి. మహిళలు వైసీపీకి అండగా నిలిచారు. చాలా సైలెంట్గా వైసీపీకి ప్రజలు ఓట్లు వేశారు. అన్ని పార్టీలు ఏకమైనా వాళ్లు గెలవడం లేదు. ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో వాళ్లు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.
ఏపీలో కూటమి 20 నుంచి 23 లోక్సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3-5, బీజేపీ 4-6, జనసేన 2 సీట్లు సాధిస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ ఒక్క సీటులోనూ నెగ్గదని పేర్కొంది.
దేశంలో మరోసారి కమలం పార్టీనే అధికారం చేపడుతుందని Dainik Bhaskar సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 281-350, ఇండియా కూటమికి 145-201, ఇతరులకు 33-49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగినట్లు తెలిపింది.
ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం పలు రాష్ట్రాల ఫలితాలు ఇలా..
* రాజస్థాన్: NDA 16-19, INDIA 5-7, OTH 1-2
* మధ్యప్రదేశ్: NDA 28-29, INDIA 0-1, OTH 0
* ఛత్తీస్గఢ్: NDA 10-11, INDIA 0-1, OTH 0
* ఝార్ఖండ్: NDA 8-10, INDIA 4-6, OTH 0
* గోవా: NDA 1, INDIA 1, OTH 0
APలో TDPకి 92-99 సీట్లు వస్తాయని Rise సర్వే అంచనా వేస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలైన జనసేన: 11-16, బీజేపీ: 0-3 స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు టీడీపీ: 110 (+/-5) సెగ్మెంట్లు సొంతం చేసుకుంటుందని Prism ఎగ్జిట్ పోల్ చెబుతోంది. JSP: 14 (+/-1), BJP: 2(+/-1) చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. YCP 60 (+/-5) నియోజకవర్గాలకే పరిమితం కాబోతుందని వివరాలు వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా వచ్చే సీట్లపై కూటమి నేతల అంచనా ఇలా ఉంది.
● ఉత్తరప్రదేశ్: 40, కర్ణాటక: 15-16, రాజస్థాన్: 7, మహారాష్ట్ర: 24, బిహార్: 22, తమిళనాడు+పుదుచ్చేరి : 40, కేరళ: 20, బెంగాల్: 24, పంజాబ్: 13, చండీగఢ్: 1, ఢిల్లీ: 4, ఛత్తీస్గఢ్: 5, ఝార్ఖండ్: 10, మధ్యప్రదేశ్: 7, హరియాణా: 7
తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం ఉందని CNX Exit Poll సంస్థ అంచనా వేసింది. తెలంగాణలో BJP: 8-10, INC: 6-8, BRS: 0-1, AIMIM: 1 సీటు గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది. కర్ణాటకలో BJP: 18-22, INC: 4-8, JDS: 1-3 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
మహారాష్ట్రలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు Times Of India Poll అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 22-26, ఇండియా కూటమికి 23-25, ఇతరులకు 0-10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.