News June 1, 2024

ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం: ఆరామస్తాన్

image

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరామస్తాన్ సర్వే చెబుతోంది. జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది.
– మరిన్ని ఎగ్జిట్ పోల్స్ అందరికంటే ముందుగా వే2న్యూస్‌లో పొందండి.

News June 1, 2024

మంగళగిరి నుంచి లోకేశ్ గెలుస్తారు: ఆరా మస్తాన్

image

AP: టీడీపీ కీలక నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితం వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు.

News June 1, 2024

ABP-C VOTER: వైసీపీకి 0-4 ఎంపీ సీట్లే..

image

AP లోక్‌సభ ఎన్నికల్లో TDP-జనసేన-BJP కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఏబీపీ – సీఓటర్ సర్వే అంచనా వేసింది. ఆ మూడు పార్టీలు 21-25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 0 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 7-9 స్థానాల చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. BRS-0, ఇతరులు 1 చోట విజయం సాధించవచ్చు.

News June 1, 2024

TV9 SURVEY: కేరళలో కాంగ్రెస్‌దే పైచేయి!

image

కేరళకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను టీవీ9 ప్రకటించింది. కాంగ్రెస్‌కు 13 సీట్లు, CPM 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సీపీఐ 1, కేఈసీ 1, BJP 1 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.
> ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వేలో కాంగ్రెస్ కూటమికి 17-18, NDA 2, LDF(సీపీఐ+కేఈసీ) 1 సీటు వస్తుందని తేలింది.

News June 1, 2024

కేరళలో యూడీఎఫ్ హవా: ఇండియా టుడే

image

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అత్యధిక లోక్‌సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. యూడీఎఫ్: 17-18 సీట్లు, ఎన్డీఏ 2-3 సీట్లు, అధికార ఎల్డీఎఫ్: 0-1 సీటు సాధిస్తాయని వెల్లడించింది. యూడీఎఫ్ 41శాతం, ఎన్డీఏ 27శాతం, ఎల్డీఎఫ్ 29శాతం, ఇతరులు 3శాతం ఓట్ షేర్ సాధిస్తాయని పేర్కొంది.

News June 1, 2024

కర్ణాటకలో బీజేపీదే హవా: India Today

image

కర్ణాటకలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని India Today Axis My India తెలిపింది. 28 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ: 20-22, కాంగ్రెస్: 3-5, జేడీఎస్- 2-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. బీజేపీకి 48 శాతం, కాంగ్రెస్‌కు 41, జేడీఎస్‌కు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

News June 1, 2024

పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారు: ఆరా మస్తాన్

image

AP: పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించారు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు కూడా గెలుస్తారని వెల్లడించారు. ఇక తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

News June 1, 2024

INDIA TODAY: తమిళనాడు INDIA కూటమిదే!

image

తమిళనాడులో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. INDIA కూటమికి 33-37 సీట్లు వస్తాయని అంచనా వేసింది. NDAకు 2-4 సీట్లు, AIADMKకు 0-2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంది.

News June 1, 2024

పీపుల్స్ పల్స్: టీడీపీకి 95-100 సీట్లు

image

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి 95-110 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. వైసీపీ కేవలం 45-60 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. జనసేన 14-20, బీజేపీ 2-5 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఇక లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 13-15 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైసీపీ 3-5, జనసేన 2, బీజేపీ 2-4 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది.

News June 1, 2024

ఏపీలో వైసీపీకి 13 ఎంపీ సీట్లు: TV9

image

ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి 13, టీడీపీకి 9, బీజేపీకి 2, జనసేన ఒక స్థానంలో గెలుస్తాయని TV9 సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేవని పేర్కొంది. కాగా గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో గెలవగా.. టీడీపీ కేవలం 3 సీట్లే(గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం) గెలిచింది.