News June 1, 2024

సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర నేడే

image

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్‌లో మరో వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి ఆమె ఇవాళ రా.10 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. వీరు వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ యాత్ర మే 7నే జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది.

News June 1, 2024

AI స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ హవా

image

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ AI స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ హవా కొనసాగించింది. టాప్-10 అమ్మకాల్లో గెలాక్సీ S24 సిరీస్‌లోని 3 మోడల్స్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయని ఓ రిపోర్టు వెల్లడించింది. S24 అల్ట్రా 30%, S24 16.8%, S24 ప్లస్ 11.5% వాటాను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో Xiaomi 14(7.7%), వివో X100(4.9%) ఉండగా, గూగుల్ పిక్సల్ 8ప్రొ 2.2% వాటాతో చివరిలో నిలిచింది.

News June 1, 2024

క్రికెటర్ గిల్‌తో పెళ్లి వార్తలు.. నటి రియాక్షన్ ఇదే

image

భారత క్రికెటర్ గిల్‌తో డిసెంబర్‌లో పెళ్లంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీవీ నటి రిధిమా పండిట్ ఖండించారు. తనకు వ్యక్తిగతంగా గిల్ ఎవరో కూడా తెలియదని మీడియాకు చెప్పారు. ఎవరో క్రియేట్ చేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇది హాస్యాస్పదమన్నారు. తాను ప్రస్తుతానికి సింగిల్ అని, ఏమైనా ఉంటే తానే ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. ఈ అమ్మడు బిగ్ బాస్ OTT, ఫియర్ ఫ్యాక్టర్ వంటి రియాల్టీ షోలలో కనిపించారు.

News June 1, 2024

విండీస్ పిచ్‌లపై అదే కీలకం: గవాస్కర్

image

భారత జట్టు తప్పకుండా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. T20 వరల్డ్‌కప్‌లో విండీస్ పిచ్‌లపై బౌలింగ్ అత్యంత కీలకమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాకప్ ఫాస్ట్ బౌలర్‌గా పాండ్య ఉంటారని తెలిపారు. భారత జట్టు ఈసారి అద్భుత ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాతో వార్మప్ మ్యాచ్ టీమ్ కూర్పుపై ఓ అవగాహనకు వచ్చేందుకు అవకాశమని పేర్కొన్నారు.

News June 1, 2024

యువతలోనూ FB క్రేజ్ తగ్గలేదు: మెటా

image

మూడేళ్లుగా ఫేస్‌బుక్ ఎక్కువ మంది యువత(18-29)ను ఆకర్షిస్తోందని మెటా వెల్లడించింది. US, కెనడాలోని 40 మిలియన్లకు పైగా యువతీయువకులు రోజూ FBని వాడుతున్నారని పేర్కొంది. టిక్‌టాక్ లాంటి యాప్‌లకు యువత ఆకర్షితమవుతున్నప్పటికీ మెటా గ్రోత్‌పై ఎలాంటి ప్రభావం లేదంది. గత 5 త్రైమాసికాల్లోనూ FB వృద్ధి బాగుందని తెలిపింది. 2004లో ప్రారంభమైన ఈ యాప్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లు ఉన్నారు.

News June 1, 2024

చంద్రబాబు ఏ దేశానికి వెళ్లారో చెప్పాల్సిందే: జోగి

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో దాపరికం ఎందుకని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. ఆయన ఏ దేశానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు 10 రోజులు ఏ దేశంలో ఉన్నారు. ఆయన పర్యటనను గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటీ? ఎన్నిసార్లు అడిగినా టీడీపీ సమాధానం చెప్పడం లేదు. ఆయన వైద్య చికిత్స కోసం వెళ్లారా? నల్లధనం దాచడానికే విదేశాలకు వెళ్లారా?’ అని ఆయన ప్రశ్నించారు.

News June 1, 2024

చంద్రబాబు సీఎం కావడం ఖాయం: అయ్యన్న పాత్రుడు

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎం కావడం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని చంద్రబాబుకు ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు.

News June 1, 2024

సల్మాన్ హత్యకు పాక్ నుంచి ఆయుధాలు!

image

సల్మాన్ ఖాన్ హత్యకు <<13052619>>బిష్ణోయ్<<>> గ్యాంగ్ కుట్రలు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పాక్‌ నుంచి AK-47, M-16, AK-92 తుపాకులను తెప్పించినట్లు పేర్కొన్నాయి. ఆయన కదలికలను చేరవేసేందుకు 15-20 మంది రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. సల్మాన్ కారుపై కాల్పులు జరపడం లేదా పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో దాడికి ప్లాన్ చేస్తున్నాయట. రాజస్థాన్‌లో జింకలను వేటాడి చంపినప్పటి నుంచి సల్మాన్‌పై బిష్ణోయ్ పగబట్టారు.

News June 1, 2024

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ vs ఫైనల్ రిజల్ట్స్

image

*ఇండియా టుడే: వైసీపీకి 130-135, టీడీపీకి 37-40
*సీపీఎస్: వైసీపీకి 130-133, టీడీపీకి 43-44
*వీడీపీ అసోసియేట్స్: వైసీపీకి 111-121, టీడీపీకి 54-60
*ఆరా: వైసీపీకి 119-126, టీడీపీకి 47-56
>> తుది ఫలితాల్లో వైసీపీ 151 సీట్లు సాధించింది. టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫలితాలను అంచనా వేసి, కామెంట్ చేయండి.

News June 1, 2024

తమలపాకుల థీమ్‌తో పోలింగ్ కేంద్రం

image

ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒడిశాలో ఎన్నికల అధికారులు వినూత్నంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పూరీ జిల్లా కాకతాపూర్‌లోని పోలింగ్ బూత్‌ను తమలపాకులతో అలంకరించారు. పచ్చని ఆకులతో నిండిన ఆ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది. ఓటు వేసిన అనంతరం ఫొటో తీసుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రం బయట ఫొటో పాయింట్‌నూ అందంగా ముస్తాబు చేశారు. ఇవాళ ఒడిశాలోని 42 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.