News June 1, 2024

ఏడాది చివర్లో ‘హరి హర వీరమల్లు’ పార్ట్-1 రిలీజ్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేస్తామని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివర్లో పార్ట్-1 రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాల VFX, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ కంప్లీట్ చేయనున్నట్లు డైరెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తప్పుకున్న విషయం తెలిసిందే.

News June 1, 2024

వికెట్ కీపర్ బెర్త్ పంత్‌కా? శాంసన్‌కా?

image

టీమ్ ఇండియా తుది జట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలనేదానిపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అనుభవం ఆధారంగా పంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు టాక్. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో అనుభవానికే పెద్ద పీట వేయాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 1, 2024

అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?

image

TG: సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, BC రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే BC రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు టాక్. ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 1, 2024

కొన్నేళ్లలో ఏటా 50 లక్షల కార్ల విక్రయాలు: టాటా మోటార్స్

image

కొన్నేళ్లలో దేశీయంగా ప్రయాణికుల వాహనాల(PV-కార్లు, SUVలు, వ్యాన్లు) అమ్మకాలు ఏడాదికి 50 లక్షలకు మించడం సాధ్యపడతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. గతేడాది 41 లక్షల వాహనాలు అమ్ముడైన విషయాన్ని గుర్తు చేసింది. దేశంలో ప్రతి 1000 మందికి 30 వాహనాలు ఉన్నాయని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది తక్కువని, వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. దీనిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

News June 1, 2024

SBI ఉద్యోగుల లంచ్ బ్రేక్‌పై కస్టమర్ అసహనం.. బ్యాంక్ ఏమందంటే?

image

SBIలో ఉద్యోగులంతా ఒకేసారి లంచ్‌కు వెళ్లడంతో ఇబ్బంది పడ్డట్లు ఓ రాజస్థాన్ కస్టమర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మ.3 గం.కు ఉద్యోగులంతా లంచ్‌కు వెళ్లారు. ఓ పక్క లంచ్ బ్రేక్ లేదని SBI చెబుతుంటే.. ఇదేంటి? ప్రపంచం మారినా మీ సర్వీసులు మారవు’ అని ఖాళీ సీట్ల ఫొటోను షేర్ చేశారు. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. బ్రాంచ్ లోపల ఫొటోగ్రఫీ నిషిద్ధం. ఆ ఫొటోను డిలీట్ చేయండి’ అని SBI రిప్లై ఇచ్చింది.

News June 1, 2024

వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌లో భాగమైన పోలీస్ సస్పెండ్

image

స్మగ్లర్ వీరప్పన్‌ ఎన్‌కౌంటర్ టీమ్ సభ్యుడు, ASP వెల్లాదురైను హోంశాఖ సస్పెండ్ చేసింది. రిటైర్‌మెంట్‌కు ఒక్క రోజు ముందే ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 2013లో జరిగిన ఓ కేసుకు సంబంధించి ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసులో వెల్లాదురైను CB-CID నిందితుడిగా చేర్చటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా వెల్లాదురై తన టాలెంట్‌తో ఎస్ఐ స్థాయి నుంచి ఏఎస్పీ స్థాయి వరకు ఎదిగారు.

News June 1, 2024

విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

image

ఏదైనా కంపెనీకి అకస్మాత్తుగా వచ్చే భారీ లాభాలపై అధిక పన్నును విధించడాన్ని <<13353544>>విండ్‌ఫాల్<<>> ట్యాక్స్ అంటారు. ఇది సాధారణ పన్నుకు అదనం. US, UK, మంగోలియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది అమల్లో ఉంది. జులై 2022 నుంచి పెట్రోలియం ఎగుమతులపై ఇండియా కూడా ఈ పన్ను విధిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ముడి చమురు ధరలు పెరగడం, తగ్గడాన్ని బట్టి ట్యాక్స్‌లో మార్పులు ఉంటాయి.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో..

image

ఏపీలో సంక్షేమానికి ప్రజలు ఓటేశారా? ప్రభుత్వ మార్పును కోరుకున్నారా? తెలంగాణలో ఆరు నెలల్లో ప్రజల ఆలోచన మారిందా? డిసెంబర్ సీన్ రిపీట్ కానుందా?అంతేకాదు.. దేశవ్యాప్తంగా మోదీ మేనియా ఎంత మేరకు పనిచేసింది? కాంగ్రెస్ పట్ల ప్రజల అభిప్రాయం అలాగే ఉందా? ఇలా అన్ని అంశాలతో కంప్లీట్ ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం నుంచి వే2న్యూస్‌లో చూడవచ్చు. ప్రతి సర్వే ఫలితాలతో పాటు అనాలసిస్‌ను వేగంగా, సరళంగా మన యాప్‌లో పొందండి.

News June 1, 2024

పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్ మరోసారి తగ్గింపు

image

ఒక మెట్రిక్ టన్ను పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ₹5,700 నుంచి ₹5,200కు తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డీజిల్, విమాన ఇంధనంపై ఎలాంటి పన్ను లేదు. కేంద్రం పెట్రోలియంపై పన్నును మే 1న ₹9,600 నుంచి ₹8,400కు, మే 16న ₹5,700కు తగ్గించింది. ఇంధనాన్ని దేశీయంగా సరఫరా చేయడం కంటే అత్యధిక లాభాల కోసం ఎగుమతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రైవేటు కంపెనీలపై కేంద్రం జులై 2022 నుంచి ఈ పన్ను విధిస్తోంది.

News June 1, 2024

విద్యాశాఖ కొత్త కార్యక్రమం.. ఇకపై విద్యార్థుల ఇళ్లకు టీచర్లు!

image

AP: 2024-25 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ‘పేరెంట్ టీచర్-హోం విజిట్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్‌‌లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్‌కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి.