India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవసంబంధమైన, హార్మోనల్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల స్త్రీల కంటే పురుషులే అధికంగా గుండె జబ్బులబారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏటా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నట్టు WHO తెలిపింది. మహిళల్లో ఈస్ట్రోజెన్ గుండె జబ్బు ప్రమాదాల తగ్గింపులో కీలకమని, జెనెటిక్స్, దురలవాట్ల వల్లే పురుషుల్లో ఈ సమస్య అధికమని వైద్యులు చెబుతున్నారు.
హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా జాడను పసిగట్టడానికి ఇరాన్ గూఢచారి సాయాన్ని ఇజ్రాయెల్ తీసుకున్నట్టు ఫ్రెంచ్ పత్రిక తెలిపింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు బీరూట్ దక్షిణ శివారులోని హెజ్బొల్లా భూగర్భ ఆఫీసుకు నస్రల్లా చేరుకున్నారు. ఈ సమాచారాన్ని ఇరాన్ గూఢచారి ఇజ్రాయెల్కు చేరవేసినట్టు పేర్కొంది. సమాచారాన్ని ధ్రువీకరించుకున్న ఇజ్రాయెల్ గంటల వ్యవధిలోనే బీరూట్పై దండెత్తి నస్రల్లాను హతమార్చింది.
AP: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తుపై మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ హాట్ కామెంట్స్ చేశారు. ‘నెయ్యి కల్తీ జరిగిందంటే చాలు కేసు పెట్టొచ్చు. అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. నెయ్యి స్వచ్ఛంగా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్లే. కత్తి లేదా తుపాకీతో చంపినా హత్యే అవుతుంది. శిక్ష ఒక్కటే. సిట్పై వైసీపీ నేతలకు నమ్మకం లేకపోతే సీబీఐపైన కూడా వారికి ఉండదు’ అని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా IPLలో ఆడుతూ, INDకు ఆడని, BCCI కాంట్రాక్టు లేని క్యాప్డ్ ప్లేయర్ను అన్ క్యాప్డ్గా పరిగణిస్తామని <<14222929>>IPL<<>> గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఇలాంటి ఆటగాళ్లను ఆయా జట్లు అన్ క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. ధోనీని అంటిపెట్టుకునేందుకు CSKకు ఇది సాయపడుతుందని, ఆయన కోసమే ఈ రూల్ను చేర్చారేమోనని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మీరేమంటారు?
సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నాయకుడు ప్రకాశ్ కారత్ వ్యవహరించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో మధురై వేదికగా సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిని ఈ మహాసభల సందర్భంగా ఎన్నుకోనున్నారు.
అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటలలోగా అన్ని ఫ్రాంచైజీలు తమ ఫైనల్ రిటెన్షన్ల లిస్టును సమర్పించాలని బీసీసీఐ నిర్దేశించినట్లు తెలుస్తోంది. రిటెన్షన్లో గరిష్ఠంగా ఐదుగురు క్యాప్డ్, గరిష్ఠంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అనుమతించినట్లు సమాచారం. అన్క్యాప్డ్ ప్లేయర్లకు రూ.4 కోట్ల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా బీసీసీఐ కాంట్రాక్టు పొందని వారిని అన్క్యాప్డ్గా భావిస్తారని సమాచారం.
☞ కారిడార్-4: నాగోల్-RGIA(36.6కి.మీ)
☞ కారిడార్-5: రాయదుర్గం-కోకాపేట్(11.6కి.మీ)
☞ కారిడార్-6: MGBS-చాంద్రాయణగుట్ట(7.5కి.మీ)
☞ కారిడార్-7: మియాపూర్-పటాన్చెరు(13.7కి.మీ)
☞ కారిడార్-8: ఎల్బీనగర్-హయత్నగర్(7.1కి.మీ)
☞ కారిడార్-9: RGIA-ఫోర్త్ సిటీ(40కి.మీ)
☞☞ 116.2కి.మీ మార్గాన్ని రూ.32,237 కోట్ల <<14226006>>అంచనాతో <<>>ప్రతిపాదించి కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత ఆ జట్టు కివీస్పై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్లో 88కే ఆలౌటైన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 360కే పరిమితమైంది. కాన్వే(61), బ్లండెల్(60), ఫిలిప్స్(78), శాంట్నర్(67) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్ పెరీస్ 6 వికెట్లతో చెలరేగి లంకకు విజయాన్ని కట్టబెట్టారు.
TGSRTCలో త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం <<14225767>>ప్రభాకర్ <<>>వెల్లడించారు. ఉద్యోగులకు PRC, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా HYD రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. HYD సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమన్నారు.
HYD మెట్రో రెండో దశ DPRకు ప్రభుత్వం ఫైనల్ టచ్ ఇస్తోంది. రూ.32,237 కోట్ల అంచనాతో మొత్తం 116.2 KM మార్గం నిర్మించనున్నారు. ఎయిర్పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40KM, ఆరాంఘర్-కొత్త హైకోర్టు(రాజేంద్రనగర్) మీదుగా ఎయిర్పోర్టుకు కొత్త లైన్, కారిడార్-4 భాగంగా నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36.6KM కొత్త మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్లో దాదాపు 1.6కి.మీ మేర భూగర్భంలో మెట్రో లైన్ నిర్మిస్తారు.
Sorry, no posts matched your criteria.