India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతున్నట్లు ఐఎండీ రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జూన్ 8న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఈ సారి అంచనా కంటే ఒకరోజు ముందుగానే(మే 30) కేరళలోకి ప్రవేశించాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3న, 2022లో మే 29న రుతుపవనాలు కేరళలోకి ఎంట్రీ ఇచ్చాయి.
యూకే పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారు. ఎన్నికల పోలింగ్ అనంతరం గత నెల 17న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. నరేంద్ర మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులతో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సా.6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రఘు తాత’ సినిమాను ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిర్గంధూర్ నిర్మిస్తున్నారు. అల్లుఅర్జున్ ‘పుష్ప-2’ కూడా ఆగస్టు 15నే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
TG: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి TGPSC <
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మే 30/31న తీర్పు వెలువరించే ప్రయత్నం చేస్తామని జడ్జి చెప్పినప్పటికీ, తీర్పు వెలువరించలేదు. నేటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో సెలవుల తర్వాతే కవిత బెయిల్పై తీర్పు వచ్చే అవకాశముందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ఈనెల 3న కవిత కస్టడీ ముగియనుంది.
సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు తలెత్తడంతో 1.25లక్షలకు పైగా కార్లను రీకాల్ చేసినట్లు Tesla ప్రకటించింది. 2012-2024 మధ్య తీసుకొచ్చిన S మోడల్, 2015-2024 మధ్య లాంచ్ అయిన X మోడల్, 2017-2023 మధ్య తెచ్చిన Y మోడళ్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. వీటిలో సీటు బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నల్స్ టైమ్కి అందడం లేదని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొంది.
ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అమిత్షా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదన్న కాంగ్రెస్ నిర్ణయంపై ‘పారిపోకండి’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. ‘INCకి భారీ ఓటమి తప్పదు. ఆ విషయం ఆ పార్టీకి తెలుసు. ఇక ప్రజలను, మీడియాను ఎలా ఎదుర్కొంటుంది? అందుకే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకుండా పారిపోతోంది. అలా చేయకుండా ఓటమినెదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.
తిరుమలలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రతిరోజూ(MON-SAT) మ.3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్ను ఏర్పాటు చేయనుంది. ఈ సమయంలో ఇతర క్యూలు నిలిపివేసి, వీరికి నేరుగా ఉచిత దర్శనం కల్పిస్తారు. దీనికోసం TTD వెబ్సైట్లో టికెట్ బుక్(FREE) చేసుకోవాల్సి ఉంటుంది. 65+వయసున్న వారు, హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. వారు ఆధార్, మెడికల్ సర్టిఫికెట్ చూపించాలి.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్(63) పేరిట ఉంది. ఈ లిస్టులో అతని తర్వాతి స్థానాల్లో వరుసగా రోహిత్ శర్మ(35), జోస్ బట్లర్(33), యువరాజ్ సింగ్(33), డేవిడ్ వార్నర్(31), షేన్ వాట్సన్(31), ఏబీ డివిలియర్స్(30), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు. అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు రోహిత్ శర్మ(39) పేరిట ఉంది. షకీబ్ (36) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.