News September 29, 2024

దసరాలోపు బకాయిలు చెల్లించే ప్రయత్నం: పొన్నం

image

TG: ఆర్టీసీ కార్మికులకు బకాయిపడ్డ అన్నిరకాల అలవెన్సులను దసరా లోపు చెల్లించే ప్రయత్నం చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్‌లో 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. పదేళ్లుగా ఆర్టీసీ‌లో ఉద్యోగులు, బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. గతంలో కష్టాల‌ను ఎదుర్కొన్న సంస్థను రక్షించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.

News September 29, 2024

తెలంగాణపై మోదీ ప్రశంసలు

image

తెలంగాణ ప్రజలపై 114వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు. దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు.

News September 29, 2024

IND vs BAN: మూడో రోజూ వర్షార్పణమే

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News September 29, 2024

నస్రల్లా హత్య.. రంగంలోకి ‘బ్లాక్ యూనిట్’

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు బ్లాక్ యూనిట్ ప్రతీకారం తీర్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిని షాడో యూనిట్ లేదా యూనిట్ 910గా కూడా వ్యవహరిస్తారు. ఇది హెజ్బొల్లాలో కోవర్ట్ వింగ్. అప్పట్లో హెజ్బొల్లా చీఫ్ ముసావి హత్య అనంతరం ఈ యూనిట్ ప్రతీకార దాడులకు పాల్పడింది. లెబనాన్ బయట ఇది దాడులకు దిగుతుంది. యూదులు, దౌత్య కార్యాలయాలు, ఇజ్రాయెలీ పర్యాటకులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేస్తుంది.

News September 29, 2024

అకౌంట్లో డబ్బులు జమ కాని వారికి GOOD NEWS

image

AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పలువురి బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసింది. పలు కారణాలతో నగదు అందని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో భేటీ కానున్న సీఎం వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు.

News September 29, 2024

విశాఖలో షాపింగ్‌ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్

image

AP: సీఎం చంద్రబాబుతో నిన్నటి సమావేశం విజయవంతమైందని లులు ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ‘చంద్రబాబుతో నాకు 18 ఏళ్ల అనుబంధం ఉంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన షాపింగ్ మాల్‌తో పాటు 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లు నిర్మిస్తాం. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News September 29, 2024

IPL.. వేలంలో RTM ఆప్షన్ ఏంటి?

image

IPL మెగా వేలానికి ముందు RTM(రైట్ టు మ్యాచ్) <<14222929>>ఆప్షన్‌ను <<>>BCCI తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉదాహరణకు SRHకు చెందిన ట్రావిస్ హెడ్ కోసం RCB రూ.12 కోట్లకు వేలం పాడితే, SRHను RTM కోసం అడుగుతారు. ఈ ఆప్షన్ ద్వారా రూ.12 కోట్లు చెల్లించి హెడ్‌ను SRH తిరిగి పొందవచ్చు. ఒకవేళ RCB రూ.16 కోట్లు చెల్లించేందుకు బిడ్ దాఖలు చేస్తే SRH ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే అతడిని వదులుకోవాల్సి ఉంటుంది.

News September 29, 2024

IPL: ఆటగాళ్ల రిటెన్షన్‌పై ‘జియో సినిమా’ అంచనా.. మీరేమంటారు?

image

వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌పై స్పష్టత రావడంతో జట్లు ఎవరిని అంటిపెట్టుకుంటాయనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే RCB, MI, CSK, SRH రిటెన్షన్ ఆటగాళ్లను జియో సినిమా అంచనా వేసింది.
MI: రోహిత్, సూర్య, హార్దిక్, బుమ్రా‌, తిలక్ వర్మ, ఇషాన్‌
RCB: కోహ్లీ, పాటిదార్, గ్రీన్, సిరాజ్‌
CSK: ధోనీ, రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, దేశ్‌పాండే
SRH: కమిన్స్‌, హెడ్, అభిషేక్, క్లాసెన్, భువీ, నితీశ్‌

News September 29, 2024

మీ పిల్లల్ని Sportsలో జాయిన్ చేశారా!

image

విద్యార్థుల చ‌దువులను మెరుగుప‌ర‌చ‌డంలో క్రీడలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రీడ‌ల వ‌ల్ల వారిలో ఆలోచన, అభ్యాస సామర్థ్యాలు, టీమ్‌వర్క్-కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు వంటి సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే స‌మ‌య‌పాల‌న‌-క్ర‌మ‌శిక్షణ‌తో కూడిన న‌డ‌వ‌డిక‌, ఏకాగ్ర‌తను పెంచి ఒత్తిడిని త‌గ్గిస్తాయ‌ని, త‌ద్వారా వారి చదువులు మెరుగుప‌డ‌తాయ‌ని పేర్కొంటున్నారు.

News September 29, 2024

చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి

image

AP: తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని YCPనేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులు ఎందుకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు? శ్రీవారికి అపచారం జరిగితే PSలో కంప్లైంట్ ఇచ్చి ఊరుకుంటారా? వేంకటేశ్వరస్వామిపై మీ భక్తి ఇదేనా? వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్’ అని ఆయన ఆరోపించారు.