News May 31, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 31, శుక్రవారం
బ.అష్టమి: ఉదయం 9:38 గంటలకు
శతభిష: ఉదయం 6:14 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:12 నుంచి ఉదయం 9:04 వరకు
తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:22 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు

News May 31, 2024

HEADLINES TODAY

image

● 45 గంటల ధ్యానంలో ప్రధాని మోదీ
● దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
● ఉద్దేశ‌పూర్వ‌కంగానే రాజ‌ముద్ర మార్పు: కేటీఆర్‌
● ఏపీ ఐసెట్‌లో 96.71 శాతం ఉత్తీర్ణత
● రిజల్ట్ తర్వాత ర్యాలీలు నిర్వహించొద్దు: ఏపీ సీఈవో
● ముగిసిన లోక్‌సభ-2024 ఎన్నికల ప్రచారం
● కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
● నీట్(యూజీ) ప్రిలిమినరీ కీ విడుదల
● అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు

News May 31, 2024

USలో టీమ్ ఇండియాకు వసతులు కరవు!

image

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లిన భారత జట్టుకు వసతులు కరవైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవని సమాచారం. ఈ ఏర్పాట్లపై టీమ్ ఇండియా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. దీనిపై ఇప్పటికే ఐసీసీ స్పందించి సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అదే నెల 9న పాకిస్థాన్‌తో తలపడనుంది.

News May 30, 2024

86.5%కి పెరిగిన ₹500 నోట్ల వాడకం

image

₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావంతో ₹500 నోట్ల వాడకం 86.5%కి చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాది ఇది 77.1%గా ఉండగా.. మే 2023లో ₹2వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో అమాంతం పెరిగిందని తెలిపింది. 2024 మార్చి 31కి వాడుకలో ₹500(5.16 లక్షల నోట్లు)టాప్ ప్లేస్‌లో ఉండగా.. ₹10 నోట్లు(2.49 లక్షల నోట్లు) రెండో స్థానంలో ఉన్నట్లు వివరించింది.

News May 30, 2024

న్యూయార్క్ పయనం

image

టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అమెరికా బయలుదేరారు. గురువారం రాత్రి అతడు ముంబై విమానాశ్రయంలో అమెరికా ఫ్లైట్ ఎక్కారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ ఎలిమినేటర్‌ మ్యాచ్ తర్వాత బీసీసీఐ అనుమతితో కొన్ని రోజులు కుటుంబసభ్యులతో గడిపారు. రెండు రోజుల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండటంతో న్యూయార్క్ పయనమైన కోహ్లీ శుక్రవారం భారత జట్టుతో కలవనున్నారు.

News May 30, 2024

ఇండియాకు బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ

image

మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి ఇండియాకు బయల్దేరారు. ఈ రోజు అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకుంటారు. ఆయనను ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. రేపు ఆయనను విచారించనున్నారు. ఇదిలా ఉంటే రేవణ్ణను అరెస్ట్ చేయాలని కర్ణాటకలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

News May 30, 2024

నాకు వ్యతిరేకంగా అఘోరాలతో యాగం: డీకే

image

తనకు వ్యతిరేకంగా కొందరు యాగాలు చేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతోపాటు సీఎం సిద్ద రామయ్యకు వ్యతిరేకంగా కేరళలో ‘శత్రు భైరవి యాగం’ చేస్తున్నారని తెలిపారు. ‘మా ప్రభుత్వంపై కుటిల యత్నం జరుగుతోంది. ఆ యాగాన్ని అఘోరాల నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. యాగం చేసే వారి వివరాలు నాకు తెలుసు. కానీ వారి పేర్లను నేను బయటపెట్టను’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

News May 30, 2024

పల్నాడులో ఖైదీలకు జైళ్లు సరిపోవడం లేదు: ఎస్పీ మలికా గార్గ్

image

AP: ఎన్నికల ఖైదీలకు పల్నాడు జిల్లాలోని జైళ్లు సరిపోవడం లేదని SP మలికా గార్గ్ తెలిపారు. కొంతమందిని రాజమండ్రి జైలుకు పంపుతున్నట్లు చెప్పారు. ‘పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా వ్యాపిస్తోంది. పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని నా స్నేహితులు అడుగుతున్నారు. చెడు ఘటనలతో పల్నాడు పేరు మార్మోగడం బాధాకరం. కర్రలు, రాడ్లు పట్టుకుని తిరగడం అవసరమా’ అని ఆమె ప్రశ్నించారు.

News May 30, 2024

ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ICC.. ఎందుకంటే?

image

టీ20 వరల్డ్ కప్‌ కోసం ఉగాండా క్రికెట్ బోర్డు ప్రకటించిన జెర్సీని మార్చుకోవాలని ICC సూచించింది. తమ జాతీయ పక్షి అయిన గోధుమ వర్ణపు కొంగను స్ఫూర్తిగా తీసుకొని ఉగాండా జెర్సీని రూపొందించింది. అయితే భుజాలపై కొంగ రెక్కల్లా డిజైన్ ఉండటం వల్ల స్పాన్సర్ల లోగోలు కనిపించవని ICC చెప్పింది. దీంతో ఆ జట్టు జెర్సీని మార్చుకుంది.

News May 30, 2024

ఆ ఊరిలో ఆఖరి వ్యక్తి మృతి

image

తమిళనాడులోని మీనాక్షిపురం గ్రామంలో ఏకైక నివాసి కందసామి నాయకర్(73) మరణించారు. దీంతో ఆ ఊరు దెయ్యాల గ్రామంగా మారింది. 2001లో 1,296 మందితో ఊరు కళకళలాడేది. అస్థిర వర్షాలు, తీవ్రమైన కరవు కారణంగా ఆ గ్రామాన్ని విడిచి అందరూ వలసవెళ్లారు. కందసామి మాత్రం తన భార్యతో 20ఏళ్లు అక్కడే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోగా ఇప్పుడు కందస్వామి కన్నుమూశారు. దీంతో గ్రామం ఖాళీ అయ్యింది.