India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేడు ఉప్పల్లో SRH, LSG మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హోమ్ గ్రౌండ్లో విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఫ్లాట్ ట్రాక్, ఫాస్ట్ ఔట్ఫీల్డ్, చిన్న బౌండరీల వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బాల్తో ఫాస్ట్ బౌలర్లకు కలిసి రావొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 220-230 పరుగుల టార్గెట్ను ఫిక్స్ చేయొచ్చని అంచనా.

వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి 10గ్రా. 24 క్యారెట్ల బంగారంపై రూ.5,350 పెరిగింది. 22 క్యారెట్లపై రూ.4,900 పెరుగుదల నమోదైంది. APR 2న మాత్రమే తగ్గుదల కన్పించింది. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ ప్రకటనలతో స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల బులియన్ మార్కెట్పైనా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం HYDలో 24 క్యారెట్ల పసిడి 1,50,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,350గా ఉంది.

కేవలం 2 వారాలు మైదా పక్కన పెడితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ తగ్గి రోజంతా ఎనర్జీ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని మానేస్తే జీర్ణక్రియ మెరుగై గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. మైదాకు బదులు తృణధాన్యాలు తింటే ఆకలి త్వరగా వేయదు. వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. విటమిన్లు, మెగ్నీషియం పెరిగి చర్మం మెరుస్తుంది.

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్లో SRH తన పర్ఫార్మెన్స్తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.

IPL మ్యాచ్లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

AP: ప్రేమ వివాహం చేసుకున్న <<19545664>>చౌడేశ్వరిని<<>> నిబంధనలకు విరుద్ధంగా, బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినందుకు మాచర్ల CI వెంకటరమణను జిల్లా SP సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. CI అప్పగించిన కాసేపటికే ఆమె హత్యకు గురవడంతో ఈ నేరంలో ఆయన పాత్రపై ఆరోపణలొచ్చాయి. దీంతో CIపై SP కృష్ణారావు చర్యలు తీసుకున్నారు.

జైపూర్లో ఓ ఏనుగుకు ఒళ్లంతా పింక్ కలర్ వేసి ఫొటోషూట్ చేయడం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటన ఏడాది క్రితం జరిగినట్లు తాజాగా తేలింది. దాదాపు 67 ఏళ్ల వయసున్న చంచల్ అనే ఆ ఏనుగు ఫిబ్రవరిలోనే కార్డియాక్ అరెస్ట్తో మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని NDTV పేర్కొంది. వృద్ధాప్యం వల్లే చనిపోయిందని, కలర్తో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు తెలిపారు.

ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. UPIతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి ‘ఈ-నోటీస్’ వస్తుంది. 72 గంటల్లోపు ఆన్లైన్లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.

⋆ బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత ఆర్చర్ పాయల్ నాగ్కు గోల్డ్ మెడల్
⋆ ఆరో తరగతి నుంచి 3 భాషల విధానం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు: CBSE
⋆ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగం.. 1972 తర్వాత తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి మనుషులు
⋆ ప్రపంచంలో అత్యంత బరువైన (7 టన్నులు) కార్గో డ్రోన్(Changying-8 లేదా CY-8)ను పరీక్షించిన చైనా.. దీని రేంజ్ 1,850మైళ్లు (2,977kms)
Sorry, no posts matched your criteria.