India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.

TG: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులిచ్చిన సమాచారాన్ని అధికారులు క్షుణ్నంగా పరిశీలించి పత్రాలను ఓకే చేశారు. మొత్తం 2,996 వార్డుల్లో 19,608 మంది బరిలో నిలిచారు. రేపటి (3వతేదీ) వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తుంది. ఈనెల 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.

AP: YCP ట్రాప్లో పడితే వారికీ, మనకూ తేడా ఉండదని సీఎం చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. సంయమనం పాటించాలని సూచించారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులతో వైసీపీ పుట్టిందని విమర్శించారు. అలజడి సృష్టించేందుకు, పాపాలను పక్కదారి పట్టించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి అజెండాతోనే ముందుకెళ్దామని చెప్పారు.

ఇరాన్లోని ప్రతిష్ఠాత్మక చాబహార్ పోర్టుకు బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. పాక్లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు కౌంటర్గా భారత్ ఇరాన్తో చేతులు కలిపి దీనిని నిర్మించింది. దీనికి కొన్నేళ్లుగా ఏటా ₹100కోట్ల చొప్పున కేటాయిస్తోంది. మధ్య ఆసియా, పశ్చిమాసియా వాణిజ్యానికి ఇది ఎంతో కీలకం. అయితే US-ఇరాన్ టెన్షన్స్, ఒత్తిళ్ల నేపథ్యంలో ఈసారి నిధులు కేటాయించలేదని తెలుస్తోంది.

పుదుచ్చేరిలోని <

* స్వీట్లు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే మంచి రుచిగా ఉంటాయి. * పప్పులకు పురుగు పట్టకుండా ఎక్కువరోజులు తాజాగా ఉండాలంటే, వాటిని నిల్వ చేసే డబ్బాలో అడుగున నాలుగైదు వెల్లుల్లి రేకలు వేయాలి. * కొబ్బరి ముక్కలు నిల్వ ఉన్నా వాసన రాకుండా ఉండాలంటే, చిప్పల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి. * బాదం, వేరుశనగ, జీడిపప్పు వంటివాటిని డబ్బాల్లో పెట్టే బదులు, ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఫ్రిజ్లో ఉంచాలి.

AP: చంద్రబాబు పాలనలో కాపు కులాన్నే టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి ఫ్యామిలీని అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. ‘కల్తీ నెయ్యి ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారు. కాపులకు మీపై ఎంత కోపం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్పై ప్రేమతో మీకు మద్దతిచ్చాం’ అని చంద్రబాబు, లోకేశ్కు లేఖ రాశారు.

గుడ్డులో ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, హెల్తీ ఫాట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఉడికించిన గుడ్డు/ ఆమ్లెట్ ఏది తింటే ప్రయోజనమని చాలామందికి డౌట్ ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉడికించిన గుడ్డు తినాలంటున్నారు నిపుణులు. అలాగే ఆమ్లెట్ను తక్కువ నూనె, రకరకాల కూరగాయలతో చేయడం వల్ల రుచికరమైన పోషకాహారం అందుతుందంటున్నారు. ఎలా తిన్నా గుడ్డులోని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.

AP: మాజీ మంత్రి జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై తీవ్ర <<19023498>>వ్యాఖ్యలు<<>> చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జోగి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జోగి రమేశ్ ఇంటికి నిప్పు అంటించిన ఘటనలోనూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఎరువుల తయారీలో కీలక ముడిపదార్థాలైన అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్ లాంటి ఉత్పత్తులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులను రద్దు చేసింది. దీని వల్ల DAP, NPK వంటి కాంప్లెక్స్ ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువుల ముడి సరుకులను మనం ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్సుంది.
Sorry, no posts matched your criteria.