News October 30, 2025

విత్తనాల కొనుగోలుకు ₹110 కోట్ల బ్యాంకు రుణం

image

AP: రబీ(2025-26)లో పంపిణీ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఏపీ సీడ్ కార్పొరేషన్ ₹110 కోట్ల రుణం తీసుకోనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకొనే ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ రుణాన్ని తీర్చలేని పక్షంలో ఈ గ్యారంటీ వర్తిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు క్లోజర్‌కు సున్నాఛార్జీలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణంతో రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తారు.

News October 30, 2025

ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

image

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 30, 2025

ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల

image

TG: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందజేస్తామన్నారు. ఖమ్మంలో వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 4.5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారినీ ఆదుకుంటామని చెప్పారు. రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.

News October 30, 2025

మెనుస్ట్రువల్ లీవ్‌కు ఫొటో అడగడంపై ఆందోళనలు

image

మహిళలు బయటకు చెప్పలేని అంశాల్లో రుతుస్రావం ఒకటి. విధులకూ వెళ్లలేని స్థితి. ఈ కారణంతో సెలవు అడిగిన సిబ్బందిని మెనుస్ట్రువల్ ఫొటోలు పంపాలని MD వర్సిటీ(హరియాణా) అధికారులు అడగడం వివాదంగా మారింది. గవర్నర్ వర్సిటీని సందర్శించినప్పుడు ఇది చోటుచేసుకుంది. చివరకు తాము వాడిన ప్యాడ్స్ ఫొటోలు పంపినా సెలవు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు. దీనిపై ఆందోళనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ గుప్తా తెలిపారు.

News October 30, 2025

టీమ్ ఇండియాకు బిగ్ షాక్

image

WWC: ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న స్మృతి మంధాన(24) ఔటయ్యారు. తొలుత బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించగా, ఆసీస్ క్యాచ్ కోసం రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్మృతి అసంతృప్తిగా పెవిలియన్‌కు వెళ్లారు. అంతకుముందు షెఫాలీ 10 పరుగులకే వెనుదిరిగారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా ఉంది.

News October 30, 2025

2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్‌లో సంచలన విషయాలు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.

News October 30, 2025

కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.

News October 30, 2025

టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

image

టెస్టుల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుంచి 2 టీ బ్రేక్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ సెషన్ 9-11am, సెకండ్ సెషన్ 11-20am-1.20pm, మూడో సెషన్ 2-4pmగా ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. లంచ్‌కు ముందు ఒకటి, తర్వాత మరో టీ బ్రేక్ అమల్లోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న సంగతి తెలిసిందే.

News October 30, 2025

అజహరుద్దీన్‌‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

image

TG: అజహరుద్దీన్‌ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్‌లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.

News October 30, 2025

CBSE పరీక్షల తేదీలు విడుదల

image

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.