India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని Nov 26లోపు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ అయ్యారు. దీపావళి, దేవ్ దీపావళి, ఛట్ పూజ వంటి పర్వదినాలను దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ ప్రకటించాల్సిందిగా పార్టీలు కోరాయి. 288 స్థానాల్లో 9.59 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 19.48 లక్షల మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు.
TG: యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్తేజ్పై అత్యాచార కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, తరచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. ఈమేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇటీవల యూట్యూబర్ హర్షసాయిపైనా రేప్ కేసు నమోదైంది.
TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్పాస్లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్పాస్లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.
TG: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.
వాట్సాప్ ‘పోల్స్ ఫర్ స్టేటస్ అప్ డేట్స్’ అనే ఫీచర్ తీసుకురానుంది. దీనితో యూజర్లు తమ స్టేటస్లలో పోల్స్ పెట్టవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేందుకు వీలుంటుంది. ఎవరెవరు పోల్లో పాల్గొన్నారు? ఏ ఆప్షన్ ఎంచుకున్నారనేది ఇతరులకు కనిపించదు. పోల్ రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.
ఉక్రెయిన్కు 8 బిలియన్ డాలర్ల సైనిక సహాయం ఇవ్వాలని నిర్ణయించి అమెరికా పెద్ద తప్పు చేసిందని నార్త్ కొరియా అభిప్రాయపడింది. ఇది నిప్పుతో చెలగాటం లాంటిదని పేర్కొంది. ఉక్రెయిన్ సంఘర్షణను వాషింగ్టన్ తీవ్రతరం చేస్తోందని, ఐరోపా మొత్తాన్ని అణుయుద్ధం అంచుకు నడిపిస్తోందని దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. రష్యా హెచ్చరికల్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు.
AP: విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ముఖ్యమంత్రి స్టాలిన్ తిరిగి తన క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై 15 నెలలపాటు జైలులో ఉన్న సెంథిల్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఉదయనిధి స్టాలిన్కు DyCMగా ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. అలాగే క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరో ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులు ఆదివారం మధ్నాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.